వైసీపీ పాలనలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీ స్థాయి అధికారికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
‘నన్ను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లాను. 2023 ఫిబ్రవరి 20 వ తేదీన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక అక్రమకేసులో నన్ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
అర్ధరాత్రి కరెంటు తీసేసి జాషువా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనను కలిసి బొకే ఇచ్చేందుకు అతని నివాసానికి వెళ్లాను. విజయవాడ సమీపంలో తన ఏడున్నర ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన అతిథి గృహంలో ఉన్నారని తెలుసుకుని వెళ్లాను. పుషగుచ్చం, శాలువాతో సత్కారం చేద్దామని వెళ్లాను.
అయితే అతను ఇక్కడ లేరని, నిన్న ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఆయన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోయారని వాచ్మెన్ చెప్పారు. అతిథి గృహంలోనే ఒక కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువాను ఉంచి వీడియో ద్వారా తన సందేశాన్ని ఎస్పీ సెల్ ఫోన్కు పంపించా’’ అని పట్టాభి వెల్లడించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 , జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైసీపీ 11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, కీలక నేతలపై అక్రమ కేసులు పెట్టించిన వైసీపీ ముఖ్య నేతలు కొంతమంది విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. వారికి సహకరించిన అధికారులు కూడా ఒక్కొక్కరిగా రాజీనామాల బాట పడుతున్నారు. మరి కొంతమంది అధికారులు అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 6, 2024 7:07 am
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…