అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. వైసీపీ ఓటమి గురించి ముందే సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని, కేవలం 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్య నేతలు ఎన్నికల ముంగిట మాట్లాడిన కొన్ని మాటలు, చేసిన సవాళ్ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి మద్దతుదారులకు ఆ వీడియోలు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. అదే సమయంలో వైసీపీ వాళ్లకు తీరని మనోవేదన మిగులుస్తున్నాయి ఆ వీడియోలు.
ముందుగా జగన్ విషయానికి వస్తే.. ఆయన గత పర్యాయం 151 సీట్లతో సాధించిన విజయాన్ని మించి ఈసారి ఫలితాలు సాధించబోతున్నామని పదే పదే బల్లగుద్ది చెప్పారు. మీటింగుల్లో, ఇంటర్వ్యూల్లో ‘వై నాట్ 175’ అని నినదించారు. కట్ చేస్తే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ పాత వీడియోలను తిప్పుతున్నారు ప్రత్యర్థులు.
మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన సవాళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి జరుగుతుందని, అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తినీ విధి వదిలి పెట్టదని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు వైసీపీ పరాజయానికి దీన్ని అన్వయించి చూపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
ఇక పవన్ పాత వీడియోలైతే చాలానే హైలైట్ అవుతున్నాయి. జగన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు, తన పార్టీ జనసేన కాదు అంటూ పవన్ సవాల్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే తాను రెండు చోట్ల ఓడిపోతానని ఎవరైనా అనుకున్నారా, అది జరిగింది కాబట్టి వైసీపీ 151 నుంచి 15కు పడిపోదని గ్యారెంటీ ఏంటి అని ఎన్నికల ముంగిట ఒక జనసేన మీటింగ్లో పవన్ వ్యాఖ్యానించిన వీడియో కూడా హైలైట్ అవుతోంది. ఈ వీడియోలతో వైసీపీ వాళ్ల ఓటమి బాధ ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తున్నారు టీడీపీ, జనసేన ఫ్యాన్స్.
This post was last modified on June 5, 2024 5:47 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…