అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. వైసీపీ ఓటమి గురించి ముందే సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని, కేవలం 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్య నేతలు ఎన్నికల ముంగిట మాట్లాడిన కొన్ని మాటలు, చేసిన సవాళ్ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి మద్దతుదారులకు ఆ వీడియోలు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. అదే సమయంలో వైసీపీ వాళ్లకు తీరని మనోవేదన మిగులుస్తున్నాయి ఆ వీడియోలు.
ముందుగా జగన్ విషయానికి వస్తే.. ఆయన గత పర్యాయం 151 సీట్లతో సాధించిన విజయాన్ని మించి ఈసారి ఫలితాలు సాధించబోతున్నామని పదే పదే బల్లగుద్ది చెప్పారు. మీటింగుల్లో, ఇంటర్వ్యూల్లో ‘వై నాట్ 175’ అని నినదించారు. కట్ చేస్తే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ పాత వీడియోలను తిప్పుతున్నారు ప్రత్యర్థులు.
మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన సవాళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి జరుగుతుందని, అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తినీ విధి వదిలి పెట్టదని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు వైసీపీ పరాజయానికి దీన్ని అన్వయించి చూపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
ఇక పవన్ పాత వీడియోలైతే చాలానే హైలైట్ అవుతున్నాయి. జగన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు, తన పార్టీ జనసేన కాదు అంటూ పవన్ సవాల్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే తాను రెండు చోట్ల ఓడిపోతానని ఎవరైనా అనుకున్నారా, అది జరిగింది కాబట్టి వైసీపీ 151 నుంచి 15కు పడిపోదని గ్యారెంటీ ఏంటి అని ఎన్నికల ముంగిట ఒక జనసేన మీటింగ్లో పవన్ వ్యాఖ్యానించిన వీడియో కూడా హైలైట్ అవుతోంది. ఈ వీడియోలతో వైసీపీ వాళ్ల ఓటమి బాధ ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తున్నారు టీడీపీ, జనసేన ఫ్యాన్స్.
This post was last modified on June 5, 2024 5:47 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…