అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. వైసీపీ ఓటమి గురించి ముందే సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని, కేవలం 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్య నేతలు ఎన్నికల ముంగిట మాట్లాడిన కొన్ని మాటలు, చేసిన సవాళ్ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి మద్దతుదారులకు ఆ వీడియోలు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. అదే సమయంలో వైసీపీ వాళ్లకు తీరని మనోవేదన మిగులుస్తున్నాయి ఆ వీడియోలు.
ముందుగా జగన్ విషయానికి వస్తే.. ఆయన గత పర్యాయం 151 సీట్లతో సాధించిన విజయాన్ని మించి ఈసారి ఫలితాలు సాధించబోతున్నామని పదే పదే బల్లగుద్ది చెప్పారు. మీటింగుల్లో, ఇంటర్వ్యూల్లో ‘వై నాట్ 175’ అని నినదించారు. కట్ చేస్తే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ పాత వీడియోలను తిప్పుతున్నారు ప్రత్యర్థులు.
మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన సవాళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి జరుగుతుందని, అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తినీ విధి వదిలి పెట్టదని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు వైసీపీ పరాజయానికి దీన్ని అన్వయించి చూపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
ఇక పవన్ పాత వీడియోలైతే చాలానే హైలైట్ అవుతున్నాయి. జగన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు, తన పార్టీ జనసేన కాదు అంటూ పవన్ సవాల్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే తాను రెండు చోట్ల ఓడిపోతానని ఎవరైనా అనుకున్నారా, అది జరిగింది కాబట్టి వైసీపీ 151 నుంచి 15కు పడిపోదని గ్యారెంటీ ఏంటి అని ఎన్నికల ముంగిట ఒక జనసేన మీటింగ్లో పవన్ వ్యాఖ్యానించిన వీడియో కూడా హైలైట్ అవుతోంది. ఈ వీడియోలతో వైసీపీ వాళ్ల ఓటమి బాధ ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తున్నారు టీడీపీ, జనసేన ఫ్యాన్స్.
This post was last modified on June 5, 2024 5:47 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…