దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కనున్నాడు.
2014 తరువాత తొలిసారిగా బీజేపీ పార్టీ అధికారం అందుకోవడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. దాంతో ఎన్డీయే కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీయే పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇవ్వనున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి టీడీపీ కూటమికి 3 నుండి 5 మంత్రి పదువులు, జేడీయూకి 2 నుంచి మూడు, ఎల్జేపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు హెచ్ఏఎం, అప్పాదళ్, శివసేన షిండే వర్గంకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మరి చివరలకి ఏం జరుగుతుందో వేచిచూడాలి.
This post was last modified on June 5, 2024 4:27 pm
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…