Political News

మీడియా, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: చంద్రబాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు.

ముందు మీడియాకు, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎన్నికలు, గెలుపోటములు, రాజకీయాల్లో ఒడిదుడుకులు చూశానని, కానీ ఈ ఎన్నికల ప్రత్యేకమని చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించాలి అన్న కసి, వేవ్ కనిపించాయని చెప్పారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో చూశామని అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదన్నారు. ప్రజాకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, రాష్ట్ర పునర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు క్షమించరు అనే విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు, యువత భవిష్యత్తు కోసం పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేశారని అభినందించారు. అసెంబ్లీలో తనకు, తన భార్యకు జరిగిన అవమానం ఎంతో ఆవేదనకు గురిచేసిందని బాధపడ్డారు. అందుకే, ఆ కౌరవసభలో ఉండలేనని, దానిని గౌరవ సభ చేశాకే తిరిగి అడుగుపెడతానని తాను చేసిన ప్రతిజ్ఞకు ప్రజలు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు.

కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ ది కీలక పాత్ర అని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. 175 నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీలన్నీ తమవిగా భావించి కలిసికట్టుగా పనిచేశాయని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పవన్ కళ్యాణ్ కు, బిజెపి అగ్ర నేతలకు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి, జనసేన నేతలకు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు కూడా తమ పాలనపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, ఓటు వేసే మా పని అయిపోయింది అనుకోవద్దని అన్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago