Political News

మోదీ మానియా వట్టి మాయే !

‘అబ్ కీ బార్ .. చార్ సౌ పార్’ అంటూ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ ఊదరగొట్టింది. మోడీ మానియాతో లోక్ సభ ఎన్నికలను ఒంటిచేత్తో చుట్టేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అదంతా ఒట్టి మాయేనని తేలిపోయింది.

కేరళలో సినీనటుడు సురేష్ గోపీ ఆ రాష్ట్రంలో బీజేపీకి తొలి విజయం అందిచారు. అక్కడ సురేష్ గోపి విజయం కేవలం ఆయన వ్యక్తిగతమే. గత మూడేళ్లుగా ఆయన ఆ నియోజకవర్గం మీద దృష్టిపెట్టి కష్టపడడంతో ఈ విజయం దక్కింది. తెలంగాణలో ఒక్క బండి సంజయ్, ఆదిలాబాదు సీటు తప్ప… మిగతా వారంతా మోడీ కంటే ముందే ఇక్కడ వెలుగు వెలిగిన నేతలు. వారి గెలుపు కూడా మోడీ మానియా కింద వేయలేం.

ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి బీజేపీ ప్రభావం నామమాత్రం. అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో జతకట్టడంతో బీజేపీకి కలిసి వచ్చింది. అక్కడ బీజేపీ 3 స్థానాలు గెలవడంతో పాటు, టీడీపీ 16, జనసేన 2 స్థానాలు అదనంగా కలిసివచ్చాయి. ఈ 18 స్థానాలు ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రధాని కావడానికి కీలకంగా మారాయి.

ఇలాగే దేశంలో చాలామంది బీజేపీ అభ్యర్థులు మోడీ మానియాతో సంబంధం లేకుండా గెలిచిన వారున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద అసంతృప్తి, 2019 ఎన్నికల్లో బాలాకోట్, పుల్వమా సంఘటనల వల్ల బీజేపీకి విజయం దక్కింది తప్పితే మోడీ మానియా ఏమీ లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభావం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో వెనక్కి తగ్గినట్లు అర్దమవుతుంది.

This post was last modified on June 5, 2024 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

43 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago