Political News

జగన్ అసలు అక్కడికి వస్తాడా?

గత ఎన్నికల్లో మామూలుగా గెలిచి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో కానీ.. 151 సీట్లతో అసాధారణ విజయం సాధించడంతో ఆయనకు, వైసీపీ నేతలకు గర్వం తలకెక్కిందనే అభిప్రాయం జనాల్లో బలంగా కలిగింది.

జగన్ ఒక నియంత పాలించినట్లుగా రాష్ట్రాన్ని పరిపాలించడం.. ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం.. అసెంబ్లీలో టీడీపీని, బయట జనసేనను చూసి వైసీపీ నేతలు విపరీతంగా ఎగతాళి చేయడం.. జనం గమనించారు. అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి చేసిన వ్యాఖ్యలైతే దారుణాతి దారుణం. ఇంకా అనేక రకాలుగా ప్రతిపక్ష నేతలను వైసీపీ నేతలు అనరాని మాటలు అన్నారు. సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, బియ్యపు మధుసూదన రెడ్డి లాంటి వాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో తెలిసిందే.

తమ పార్టీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే జగన్ వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని ఎంజాయ్ చేయడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. అలాగే అసెంబ్లీ బయట పవన్ కళ్యాణ్ గురించి వైసీసీ వాళ్లు చేసిన ఎగతాళి అంతా ఇంతా కాదు. ఇప్పుడు టీడీపీ, జనసేన టైం వచ్చింది. వైసీపీ వాళ్ల స్థాయిలో కాకపోయినా జగన్‌ను ఆ పార్టీల నేతలు టార్గెట్ చేయడం ఖాయం.

ఈ నేపథ్యంలో కేవలం పది మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టే జగన్‌కు ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్‌కు తోడు వైసీపీ హయాంలో అరెస్ట్ చేసి దారుణంగా హింసించిన రఘురామకృష్ణంరాజు సైతం అసెంబ్లీలో ఉంటారు. వీళ్లకు ఎదురు పడాలి. ఎదుర్కోవాలి. అదే సమయంలో అధికార పార్టీ దాడిని ఫేస్ చేయాలి. ఇవన్నీ జగన్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయాలే. ఎంతో అవమాన భారాన్ని దిగమింగుకుని అసెంబ్లీలో కొనసాగడం అంత కష్టం కాదు. ఈ నేపథ్యంలో జగన్ అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లి ఈ అవమానాన్ని ఫేస్ చేయడం కంటే.. కొంచెం గ్యాప్ తీసుకుని జనంలోకి వెళ్లడానికే జగన్ ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on June 5, 2024 2:25 pm

Share
Show comments

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago