Political News

పార్టీలు మారినా ఓటరు కరుణించలే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పోటీ చేశారు. అయితే పార్టీ మారి పోటీచేసిన వారిలో కడియం కావ్య, గోడెం నగేశ్‌ మినహా మిగిలినవారంతా ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కావ్య వరంగల్‌ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్‌ నుంచి పోటీచేసిన గోడెం నగేశ్‌ విజయాన్ని అందుకున్నాడు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి జహీరాబాద్‌ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్‌ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యాడు.

బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్‌ వరంగల్‌ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు, బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందాడు. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున నాగర్‌కర్నూల్‌ నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.

ఈసారి తన కుమారుడు భరత్‌ ప్రసాద్ ను అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీచేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్‌ పెద్దపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ తరపున మహబూబాబాద్‌ స్థానం నుంచి పోటీచేసిన సీతారాంనాయక్‌ ఓడిపోయారు.

This post was last modified on June 5, 2024 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago