తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పోటీ చేశారు. అయితే పార్టీ మారి పోటీచేసిన వారిలో కడియం కావ్య, గోడెం నగేశ్ మినహా మిగిలినవారంతా ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీచేసిన గోడెం నగేశ్ విజయాన్ని అందుకున్నాడు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీచేసి ఓటమిపాలయ్యాడు.
బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ వరంగల్ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందాడు. చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నాగర్కర్నూల్ నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
ఈసారి తన కుమారుడు భరత్ ప్రసాద్ ను అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరి నాగర్కర్నూల్ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ తరపున మహబూబాబాద్ స్థానం నుంచి పోటీచేసిన సీతారాంనాయక్ ఓడిపోయారు.
This post was last modified on June 5, 2024 10:49 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…