తమిళనాడులో ఇండియా కూటమి లోక్ సభ స్థానాలు అన్నింటినీ క్లీన్స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే కూటమి తేలిపోయింది.
ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందగా.. ఎండీఎంకే, ఐయూఎంఎల్ ఒక్కోచోట విజయం సాధించాయి. కాగా, ఏఐఏడీఎంకే ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది.
తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలను పొందాలనుకున్న బీజేపీ ఆశలు ఫలించలేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ హేమాహేమీలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, చెన్నై సౌత్ లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఓటమి పాలయ్యారు.
This post was last modified on June 5, 2024 10:34 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…