తమిళనాడులో ఇండియా కూటమి లోక్ సభ స్థానాలు అన్నింటినీ క్లీన్స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే కూటమి తేలిపోయింది.
ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందగా.. ఎండీఎంకే, ఐయూఎంఎల్ ఒక్కోచోట విజయం సాధించాయి. కాగా, ఏఐఏడీఎంకే ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది.
తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలను పొందాలనుకున్న బీజేపీ ఆశలు ఫలించలేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ హేమాహేమీలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, చెన్నై సౌత్ లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఓటమి పాలయ్యారు.
This post was last modified on June 5, 2024 10:34 am
వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…
తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార…
యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో…
కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో…
సినిమాలు… అది కూడా తెలుగు సినిమాల్లో దొంగలను హీరోలుగా చిత్రీకరిస్తూ చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. వాటిలోని మలుపులను మించిన…