ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కూటమి 156 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసీపీ 19 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. వైసీపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ను జగన్ కోరారు. మరికాసేపట్లో, రాజ్ భవన్ కు సీఎం జగన్ చేరుకోబోతున్నారని తెలుస్తోంది. గవర్నర్ కు తన రాజీనామా లేఖను జగన్ సమర్పించబోతున్నారు.
మరోవైపు, ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కరకట్టతో పాటు చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం పోలీసులు కాన్వాయ్ ని కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఫలితాలపై స్పందనను తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on June 4, 2024 2:22 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…