Political News

చంద్రబాబు వ్యూహం ఫలించిన తరుణం

దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారి తీసిన ఏపీ ఎన్నికల ఫలితాలు అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అధికార వైసిపి మరీ ఇంత చేతులెత్తేసే స్థాయిలో వెనుకబడటం మాత్రం అధికార పార్టీ కార్యకర్తలు ఊహించలేదు. ఏదో టఫ్ ఫైట్ జరిగి ఉంటే పోరాడి ఓడామని సరిపెట్టుకోవచ్చు. కానీ పరిస్థితి అలా లేదు. జనంలో జగన్ సర్కారు మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఓట్ల రూపంలో పబ్లిక్ స్పష్టమైన తీరు ఇచ్చేశారు. ఒక్కడిని, ఒంటరిని, మీ బిడ్డని అంటూ జగన్ చేసిన విన్నపాలు పులివెందులలో పని చేశాయేమో కానీ మిగిలిన చోట్ల మాత్రం వాటి ప్రభావం లేదు.

ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం గొప్పగా ఫలించింది. ఎలక్షన్లు సమీపిస్తున్న టైంలో కక్షపూరిత ఉద్దేశాలతో చేసిన కుట్ర వల్ల జైలుకి వెళ్లాల్సి రావడం, జనసేనతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ని తక్కువ సీట్లైనా సరే బలమైనవి ఇచ్చి ఒప్పించడం, బీజీపీతో దోస్తీకి అంగీకారం తెలుపడం, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రచారం చివరి రెండు మూడు వారాలు విపరీతంగా క్యాంపైన్లు నిర్వహించడం ఇవన్నీ అందులో భాగమే. లోకేష్ ని ఎక్కువ హైలైట్ చేయకుండా తాను, పవన్ మాత్రమే తెరముందు కనిపించేలా వేసుకున్న ప్రణాళిక జనసేన కార్యకర్తల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా చేసింది.

టిడిపి జనసేనల ఓట్ల ట్రాన్స్ఫర్ వంద శాతం జరిగి తీరాలన్న రెండు పార్టీల నాయకుల సంకల్పం ఏపీలో అధికార మార్పిడికి దారి తీస్తోంది. తొలుత తమకు తక్కువ సీట్లు దక్కాయనే అసంతృప్తిలో ఉన్న జనసేన అభిమానుల మనసులను మార్చడంలో పవన్, చంద్రబాబులు సంయుక్తంగా విజయం సాధించారు. కలిసికట్టుగా జగన్ ని సాగనంపాలనే కాంక్షను తమ ప్రసంగాల ద్వారా రగిల్చారు. ముఖ్యంగా పవన్ తమకు ఎంత బలమయ్యింది చెప్పేందుకు చంద్రబాబు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇటు పవన్ టీడీపీ అధినాయకుడి అనుభవాన్ని గొప్పగా వర్ణించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తున్నది ఆ ఫలాలే.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

25 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago