కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికలలో సిట్టింగ్ స్థానం కేరళలోని వాయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ స్థానాల నుండి పోటీ చేశారు. ప్రస్తుతం రాయ్ బరేలీలో సమీప బీజేపీ ప్రత్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ పై 40,149 ఓట్ల ఆధిక్య ప్రదర్శిస్తున్నారు. ఇక కేరళలోని వయనాడ్ లో సీపీఐ అభ్యర్థి అన్నె రాజాపై ఏకంగా 91,421 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు.
2019 ఎన్నికల్లో యూపీ అమేథి, కేరళ వయనాడ్ ల నుండి పోటీ చేసిన రాహుల్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ చేతిలొ ఓడిపోయాడు. వయనాడ్ లో నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీ చేసిన రాహుల్ తర్వాత రాయ్ బరేలీ నుండి పోటీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అమేథీ నుండి పోటీ చేయకుండా రాహుల్ రాయ్ బరేలీ వెళ్లాడని అన్నారు. అమేథీలో కిశోరి లాల్ ను నిలబెట్టిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే స్మృతిఇరానీ అక్కడ 18 వేల ఓట్ల వెనుకంజలో ఉండడం, రెండు చోట్లా రాహుల్ భారీ ఆధిక్యంలో ఉండడం విశేషం.
This post was last modified on June 4, 2024 10:55 am
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…