Political News

జగన్, బొత్స మినహా ఓటమి బాటలో మంత్రులు

ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు ముగిసిన కౌంటింగ్ గణాంకాల ప్రకారం ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, వైసీపీ 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. టీడీపీ 100 స్థానాల్లో లీడ్ లో ఉండగా, జనసేన 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ఏపీలో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యన్నారాయణ మినహా మంత్రులంతా వెనుకబడ్డారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి రోజా, మంత్రి తానేటి వనిత, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కూడా వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, తునిలో మంత్రి దాడిశెట్టి రాజా, అమలాపురంలో మంత్రి విశ్వరూప్…ఇలా 9 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆముదాలవలసలో తమ్మినేని, గుడివాడలో కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.

This post was last modified on June 4, 2024 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

43 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago