ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు ముగిసిన కౌంటింగ్ గణాంకాల ప్రకారం ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, వైసీపీ 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. టీడీపీ 100 స్థానాల్లో లీడ్ లో ఉండగా, జనసేన 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ఏపీలో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యన్నారాయణ మినహా మంత్రులంతా వెనుకబడ్డారు.
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి రోజా, మంత్రి తానేటి వనిత, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కూడా వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, తునిలో మంత్రి దాడిశెట్టి రాజా, అమలాపురంలో మంత్రి విశ్వరూప్…ఇలా 9 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆముదాలవలసలో తమ్మినేని, గుడివాడలో కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…