ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గెలుస్తారని అనుకున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆయన భారీ స్థాయి లో వెనుకబడ్డారు. తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రధాన మంత్రి 6 వేల ఓట్లకుపైగా వెనుకబడి పోయారు. 2014 లో తొలిసారి ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రధాని మోడీ.. భారీ విజయం నమోదు చేశారు. 80 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. రెండో సారి 2019లో పోటీ చేసి కూడా.. 60 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. కానీ, ఈ సారి వెనుకబడి పోయారు.
వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈయన మూడో సారి వరుస గా పోటీలో ఉన్నారు. తొలి రెండు సార్లు ఆయన ఓడిపోయారు. ఇక, ఇప్పుడు రాయ్ దూకుడులో ఉన్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. రాహుల్ గాంధీ భారీ స్థాయిలో దూసుకుపోతున్నారు. ఈయన ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కేరళలోని సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేశారు.. ఇక్కడ ఇండియా కూటమి పార్టీ సీపీఐ ప్రత్యర్థిగా నిలిచింది.
సీపీఐ తరఫున అన్నీ రాజా పోటీలో ఉన్నారు. అయితే. వయనాడ్లో మరోసారి రాహుల్ దూసుకుపోతున్నారు.. 18 వేల ఓట్ల లీడ్ దక్కించుకున్నారు. ఇక, రాహుల్గాంధీ పోటీ చేసి మరో స్థానం.. రాయ్బరేలి. ఇది గాంధీల కుటుంబానికిబలమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు సోనియాగాంధీ. ఇలాంటి చోట.. రాహుల్ గాంధీ గెలుపును అందరూ ఊహించిందే. అయితే..పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎలాంటి పోటీ లేకుండానే ఆయన దూసుకుపోతున్నారు. 40 వేల ఓట్లను లెక్కించేసరికి రాహుల్ 28 వేల ఓట్లు లభించాయి. దీంతో రాహుల్ రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
This post was last modified on June 4, 2024 10:04 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…