Political News

ప్ర‌పంచ రికార్డు సృష్టించాం

దేశంలో జ‌రిగిన 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌పంచ రికార్డు సృష్టించిన ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొం ది. ప్ర‌పంచంలోని ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఒక్క భార‌త్‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. 64.2 కోట్ల మంది ప్ర‌జ లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్తి కావ‌డం.. మ‌రికొన్ని గంట‌ల్లోనే ఫ‌లితం వెల్ల‌డి కానున్న నేప‌థ్యంలో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోనే భార‌త‌దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో పోలింగ్‌ను నిర్వ‌హించ‌డం అతి పెద్ద స‌వాలుగా ఆయ‌న పేర్కొన్నారు. చిన్న పాటి ఘ‌ట‌న‌లు మిన‌హా.. మిగిలిన ప్ర‌క్రియ అంతా కూడా స‌జావుగా సాగింద‌ని చెప్పారు. 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో ఇది ప్ర‌పంచ రికార్డుగా మారింద‌ని తెలిపారు. ఇంత మంది ఓటేయ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఏదేశంలోనూ జ‌ర‌గ‌లే ద‌న్నారు. ఇది గ్రూప్‌-7 దేశ‌ల మొత్తం ఓటర్ల కంటే కూడా.. 1.5 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.

ముఖ్యంగా మ‌హిళ‌లు దేశ‌వ్యాప్తంగా 31 కోట్ల మంది త‌మ హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా 1.5 కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ప‌నిచేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా వివిధ కార‌ణాల‌తో 39 చోట్ల రీపోలింగ్ నిర్వ‌హించిన‌ట్టు రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. ముఖ్యంగా హిమ ప్రాంతమైన జ‌మ్ము క‌శ్మీర్‌లో పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించిన‌ట్టు చెప్పారు. ఒక్క కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంద‌ని రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు.

ధ‌న ప్ర‌వాహాన్ని ఆపాం!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌గదు ర‌వాణాను సాధ్య‌మైనంత వ‌ర‌కు నిలువ‌రించిన‌ట్టు రాజీవ్ కుమార్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ… 10 వేల కోట్ల విలువైన బంగారం.. డ్ర‌గ్స్‌, ఇత‌ర సామ‌గ్రిని ప‌ట్టుకున్న‌ట్టుచెప్పారు. మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా 144 సెక్ష‌న్ విధించిన‌ట్టు తెలిపారు ఫ‌లితాలు వ‌చ్చాక సంబ‌రాలు చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని.. కోడ్ ముగిసే వ‌ర‌కు ఎవ‌రూ ఇలాంటి ప‌నులు చేయ‌రాద‌ని తెలిపారు. అయితే.. ఏపీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌పై మాట్లాడేందుకు రాజీవ్ కుమార్ నిరాక‌రించారు. అక్క‌డి అధికారులు చూసుకుంటార‌ని తెలిపారు.

This post was last modified on June 3, 2024 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago