Political News

ప్ర‌పంచ రికార్డు సృష్టించాం

దేశంలో జ‌రిగిన 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌పంచ రికార్డు సృష్టించిన ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొం ది. ప్ర‌పంచంలోని ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఒక్క భార‌త్‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. 64.2 కోట్ల మంది ప్ర‌జ లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్తి కావ‌డం.. మ‌రికొన్ని గంట‌ల్లోనే ఫ‌లితం వెల్ల‌డి కానున్న నేప‌థ్యంలో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోనే భార‌త‌దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో పోలింగ్‌ను నిర్వ‌హించ‌డం అతి పెద్ద స‌వాలుగా ఆయ‌న పేర్కొన్నారు. చిన్న పాటి ఘ‌ట‌న‌లు మిన‌హా.. మిగిలిన ప్ర‌క్రియ అంతా కూడా స‌జావుగా సాగింద‌ని చెప్పారు. 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో ఇది ప్ర‌పంచ రికార్డుగా మారింద‌ని తెలిపారు. ఇంత మంది ఓటేయ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఏదేశంలోనూ జ‌ర‌గ‌లే ద‌న్నారు. ఇది గ్రూప్‌-7 దేశ‌ల మొత్తం ఓటర్ల కంటే కూడా.. 1.5 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.

ముఖ్యంగా మ‌హిళ‌లు దేశ‌వ్యాప్తంగా 31 కోట్ల మంది త‌మ హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా 1.5 కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ప‌నిచేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా వివిధ కార‌ణాల‌తో 39 చోట్ల రీపోలింగ్ నిర్వ‌హించిన‌ట్టు రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. ముఖ్యంగా హిమ ప్రాంతమైన జ‌మ్ము క‌శ్మీర్‌లో పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించిన‌ట్టు చెప్పారు. ఒక్క కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంద‌ని రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు.

ధ‌న ప్ర‌వాహాన్ని ఆపాం!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌గదు ర‌వాణాను సాధ్య‌మైనంత వ‌ర‌కు నిలువ‌రించిన‌ట్టు రాజీవ్ కుమార్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ… 10 వేల కోట్ల విలువైన బంగారం.. డ్ర‌గ్స్‌, ఇత‌ర సామ‌గ్రిని ప‌ట్టుకున్న‌ట్టుచెప్పారు. మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా 144 సెక్ష‌న్ విధించిన‌ట్టు తెలిపారు ఫ‌లితాలు వ‌చ్చాక సంబ‌రాలు చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని.. కోడ్ ముగిసే వ‌ర‌కు ఎవ‌రూ ఇలాంటి ప‌నులు చేయ‌రాద‌ని తెలిపారు. అయితే.. ఏపీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌పై మాట్లాడేందుకు రాజీవ్ కుమార్ నిరాక‌రించారు. అక్క‌డి అధికారులు చూసుకుంటార‌ని తెలిపారు.

This post was last modified on June 3, 2024 3:37 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

1 hour ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

2 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

3 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

4 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

7 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

7 hours ago