Political News

ఏపీలో ఏడుపు… తెలంగాణలో సంబ‌రాలు..

మాజీ ఎంపీ.. రాజ‌కీయ విశ్లేష‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుకలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ఈ సంబ‌రాల‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “ఒక‌వైపు ఏపీ ఏడుస్తోంది.. మ‌రో వైపు తెలంగాణ‌లో సంబ‌రాలు చేసుకుంటున్నారు” అని చెప్పారు.. 2014, జూన్ రెండు నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

అప్ప‌ట్లో రాష్ట్రాన్ని ఇచ్చామ‌ని చెప్పుకొన్న కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ప‌దేళ్ల విరామం త‌ర్వాత‌.. తెలంగాణ లో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఈ సంబ‌రాలను స‌హ‌జంగానే ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఏపీలో ఉన్న ప్ర‌భుత్వం ఆది నుంచి కూడా.. జూన్ 2కు ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తిజ్ఞ చేయించేవారు. రాష్ట్రం అభివృద్ధి కి క‌ట్టుబ‌డ‌తామ‌ని అంద‌రిన‌తోనూ చెప్పించేవారు. కానీ, వైసీపీ హ‌యాం లో మాత్రం అది కూడా లేకుండా పోయింది.

అయితే.. తాజాగా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌… తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా చేసుకుంటున్నార‌ని తెలిపారు. కానీ, ఏపీలో మాత్రం గ‌త ప‌దేళ్లుగా ఏడుస్తూనే ఉన్నార‌ని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కానీ.. జ‌గ‌న్ ప్ర‌భు త్వం కానీ… ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్నారు ఎవ‌రికి వారు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. త‌ద్వారా రాష్ట్రం ఇంకా స‌మ‌స్య‌ల్లోనే ఉంద‌ని చెప్పారు.

ముఖ్యంగా పోల‌వ‌రం ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో ఉన్న ఆస్తుల‌ను ర‌ప్పించే ప్ర‌య త్నం త‌క్ష‌ణ‌మే చేయాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు. ఏపీ ఆస్తుల‌పై కూడా..అద్య‌య‌నం చేయాల‌ని… నీటి వాటాలు ఎప్ప‌టికీ తెగేలా లేవ‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత పదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాలేదు అని అన్నారు. ఇదేస‌మ‌యంలో తెలంగాణ‌తో ఏపీ ముఖ్య‌మంత్రులు పోరాడ‌లేక పోవ‌డానికికార‌ణం.. వ్యాపార ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ని చెప్పారు.

మాజీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ల‌కు హైద‌రాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయ‌ని..తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఏ కొంచెం సీరియ‌స్గా ప్ర‌శ్నించినా.. వారి వ్యాపారాల‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌నే భ‌యం ఉంద‌ని అందుకే వారు మౌనంగా ఉంటున్నార‌ని ఉండ‌వ‌ల్లి విమ‌ర్శించారు. క‌నీసం ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాతైనా.. ఏపీని కాపాడుకునేందుకు స్వ‌ప్ర‌యోజ‌నాలు.. వ్యాపార ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌య‌త్నించాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు.

This post was last modified on June 2, 2024 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 minutes ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

3 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

4 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

4 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

6 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

8 hours ago