సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1న ముగియనుంది. అయితే.. ఏపీలోమాత్రం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13నే ముగిశాయి. కానీ, ఫలితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి. ఇక, దీనికి ముందు… జూన్ 1న జరిగే తుది దశ పోలింగ్ ముగిసిన మరుక్షణమే దేశంలోను.. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారనే విషయాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. దీనికి సంబంధించి ఏపీలోనూ.. రంగం రెడీ అయింది.
కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా.. ఈలోగానే వెల్లడవుతున్న జ్యోతిష్యుల జోస్యాలు.. తారా బలం, చంద్రబలం, ఇతర త్రా గ్రహరీతులు, గురు బలం వంటివాటిని లెక్కలు వేసి.. ఆయా పార్టీల అధి నాయకుల కేంద్రంగా పలువులు జ్యోతిష్యులు.. కొన్ని కొన్ని జోస్యాలు వండివారుస్తున్నారు.ఇలా చెబుతున్న జ్యోతిష్యుల్లో ప్రముఖులు ఉండడం.. వారు గతంలో చెప్పిన వాటిపై నమ్మకం కలగడంతో ఇప్పుడు కూడా వారి జ్యోస్యాలపై సర్వత్రా ఆసక్తి రేకుతోంది.
ఏపీలో ఎన్నికలు టఫ్గా జరగడం.. నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడంతో జ్యోస్యాలకు రేటింగ్ పెరగడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు.. ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించకూడదు.. కానీ, జ్యోతిష్యం ఆధారంగా చెప్పే ఎగ్జిట్ పోల్స్పై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రముఖ జ్యోతిష్యులు.. దూసుకు పోతున్నారు. వీరిలో తూర్పుగోదావరికి చెందిన పేరున్న వారు కూడా ఉన్నారు.
కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందిన శర్మ.. ప్రముఖ జ్యోతిష్యు లుగా గుర్తింపు పొందారు. తరతరాలుగా జ్యోతిష్యం చెప్పడం..పంచాంగం రాయడంలో నిష్ణాతులు. ఈయన తాజా ఎన్నికలపై స్పందిస్తూ.. వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు.
ఉపదృష్ట నాగాదిత్య: తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన నాగాదిత్య వంశ పారంపర్యంగా ఈ రంగంలో ఉన్నారు. అనేక మంది సినీ తారలకు కూడా.. వీరు జాతకాలు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నా రు. ఈయన అంచనా ప్రకారం.. టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయి. వైసీపీ ఎదురీత ఈదుతోంది.
వేణు స్వామి: హైదరాబాద్ కు చెందిన ఈయన కార్పొరేట్ జ్యోతిష్యాలు చెప్పడంలో దిట్ట. ఈయన కూడా ఏపీ ఫలితంపై అంచనా వేశారు. ఏపీలో వైసీపీ అతి కష్టం మీద గట్టెక్కుతుందని చెప్పారు. అయితే.. వీరు ముగ్గురూ కూడా.. కామన్గా ఎంచుకున్నది.. సీఎం జగన్..చంద్రబాబు జాతకాలే. మరి ఎగ్జిట్ పోల్స్ను మించి.. వీరు చెబుతున్న జ్యోతిష్యం పోల్స్ ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on June 1, 2024 7:47 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…