సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1న ముగియనుంది. అయితే.. ఏపీలోమాత్రం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13నే ముగిశాయి. కానీ, ఫలితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి. ఇక, దీనికి ముందు… జూన్ 1న జరిగే తుది దశ పోలింగ్ ముగిసిన మరుక్షణమే దేశంలోను.. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారనే విషయాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. దీనికి సంబంధించి ఏపీలోనూ.. రంగం రెడీ అయింది.
కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా.. ఈలోగానే వెల్లడవుతున్న జ్యోతిష్యుల జోస్యాలు.. తారా బలం, చంద్రబలం, ఇతర త్రా గ్రహరీతులు, గురు బలం వంటివాటిని లెక్కలు వేసి.. ఆయా పార్టీల అధి నాయకుల కేంద్రంగా పలువులు జ్యోతిష్యులు.. కొన్ని కొన్ని జోస్యాలు వండివారుస్తున్నారు.ఇలా చెబుతున్న జ్యోతిష్యుల్లో ప్రముఖులు ఉండడం.. వారు గతంలో చెప్పిన వాటిపై నమ్మకం కలగడంతో ఇప్పుడు కూడా వారి జ్యోస్యాలపై సర్వత్రా ఆసక్తి రేకుతోంది.
ఏపీలో ఎన్నికలు టఫ్గా జరగడం.. నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడంతో జ్యోస్యాలకు రేటింగ్ పెరగడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు.. ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించకూడదు.. కానీ, జ్యోతిష్యం ఆధారంగా చెప్పే ఎగ్జిట్ పోల్స్పై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రముఖ జ్యోతిష్యులు.. దూసుకు పోతున్నారు. వీరిలో తూర్పుగోదావరికి చెందిన పేరున్న వారు కూడా ఉన్నారు.
కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందిన శర్మ.. ప్రముఖ జ్యోతిష్యు లుగా గుర్తింపు పొందారు. తరతరాలుగా జ్యోతిష్యం చెప్పడం..పంచాంగం రాయడంలో నిష్ణాతులు. ఈయన తాజా ఎన్నికలపై స్పందిస్తూ.. వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు.
ఉపదృష్ట నాగాదిత్య: తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన నాగాదిత్య వంశ పారంపర్యంగా ఈ రంగంలో ఉన్నారు. అనేక మంది సినీ తారలకు కూడా.. వీరు జాతకాలు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నా రు. ఈయన అంచనా ప్రకారం.. టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయి. వైసీపీ ఎదురీత ఈదుతోంది.
వేణు స్వామి: హైదరాబాద్ కు చెందిన ఈయన కార్పొరేట్ జ్యోతిష్యాలు చెప్పడంలో దిట్ట. ఈయన కూడా ఏపీ ఫలితంపై అంచనా వేశారు. ఏపీలో వైసీపీ అతి కష్టం మీద గట్టెక్కుతుందని చెప్పారు. అయితే.. వీరు ముగ్గురూ కూడా.. కామన్గా ఎంచుకున్నది.. సీఎం జగన్..చంద్రబాబు జాతకాలే. మరి ఎగ్జిట్ పోల్స్ను మించి.. వీరు చెబుతున్న జ్యోతిష్యం పోల్స్ ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on June 1, 2024 7:47 am
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…