టీడీపీ నేతృత్వంలోని బీజేపీ-జనసేన కూటమి విజయం పరిస్థితి ఏంటి? వైసీపీని ఢీకొట్టి బలంగా ముం దుకు వస్తుందా? గెలుపు గుర్రం ఎక్కుతుందా? అనేది ఆసక్తిక ర విషయం. దీనిపై టీడీపీలో ఉన్న కీలక నాయకులు ఎవరూ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ మా త్రం తన లెక్కులు తాను పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు ముగిశాక.. లండన్కు వెళ్తూ.. ఆయన ఓ జోస్యం చెప్పారు. ఇక, పర్యటన ముగించుకుని రాబోయే ముందుకూడా జగన్ ట్వీట్ చేశారు.
దీనిలోనూ తామే గెలుస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ ఇంత దూకుడుగా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం సహా కూటమి నాయకులు, ఎన్నికల ప్రచారాన్ని ఓ కీలక మలుపు తిప్పిన పవన్ వంటి నేతలు ఎక్కడా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. దీంతో అసలు ఏమైందనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే.. విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తన అంచనాలను పార్టీ కీలక నేతలకు వెల్లడించారు.
అంతర్గత సమావేశంలో కీలక ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు తాను చేయించిన సర్వేలు.. ప్రజ ల నాడి వంటివాటిని అంచనా వేసుకుని.. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబు లెక్కలు వేసుకు న్నారు. అత్యంత రహస్యంగా చంద్రబాబు చెప్పిన ఈ వివరాలు.. విశ్వసనీయ వ్యక్తులకు టీడీపీ నేతలు లీక్ చేశారు. దీని ప్రకారం.. కూటమి 110-122 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని చంద్ర బాబు లెక్కలు వేసుకున్నారని చెప్పారు.
ఇక, మహిళా ఓటు బ్యాంకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం వైపు ఉందని.. అందుకే మహిళలు క్యూ కట్టి మరీ ఓటేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ పింఛనును రూ.4000లకు పెంచుతామని.. ఏప్రిల్ నుంచే రూ.1000 కలిపి ఇస్తామని చెప్పడంతో వృద్ధులు తమకు ఓటేశారని.. బాబు నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. దీంతో తమ గెలుపు ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నట్టు.. ధీమాగా ఉంటున్నట్టు చెప్పారు. పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే 13-14 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.
This post was last modified on May 31, 2024 12:02 pm
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…