టీడీపీ నేతృత్వంలోని బీజేపీ-జనసేన కూటమి విజయం పరిస్థితి ఏంటి? వైసీపీని ఢీకొట్టి బలంగా ముం దుకు వస్తుందా? గెలుపు గుర్రం ఎక్కుతుందా? అనేది ఆసక్తిక ర విషయం. దీనిపై టీడీపీలో ఉన్న కీలక నాయకులు ఎవరూ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ మా త్రం తన లెక్కులు తాను పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు ముగిశాక.. లండన్కు వెళ్తూ.. ఆయన ఓ జోస్యం చెప్పారు. ఇక, పర్యటన ముగించుకుని రాబోయే ముందుకూడా జగన్ ట్వీట్ చేశారు.
దీనిలోనూ తామే గెలుస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ ఇంత దూకుడుగా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం సహా కూటమి నాయకులు, ఎన్నికల ప్రచారాన్ని ఓ కీలక మలుపు తిప్పిన పవన్ వంటి నేతలు ఎక్కడా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. దీంతో అసలు ఏమైందనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే.. విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తన అంచనాలను పార్టీ కీలక నేతలకు వెల్లడించారు.
అంతర్గత సమావేశంలో కీలక ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు తాను చేయించిన సర్వేలు.. ప్రజ ల నాడి వంటివాటిని అంచనా వేసుకుని.. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబు లెక్కలు వేసుకు న్నారు. అత్యంత రహస్యంగా చంద్రబాబు చెప్పిన ఈ వివరాలు.. విశ్వసనీయ వ్యక్తులకు టీడీపీ నేతలు లీక్ చేశారు. దీని ప్రకారం.. కూటమి 110-122 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని చంద్ర బాబు లెక్కలు వేసుకున్నారని చెప్పారు.
ఇక, మహిళా ఓటు బ్యాంకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం వైపు ఉందని.. అందుకే మహిళలు క్యూ కట్టి మరీ ఓటేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ పింఛనును రూ.4000లకు పెంచుతామని.. ఏప్రిల్ నుంచే రూ.1000 కలిపి ఇస్తామని చెప్పడంతో వృద్ధులు తమకు ఓటేశారని.. బాబు నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. దీంతో తమ గెలుపు ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నట్టు.. ధీమాగా ఉంటున్నట్టు చెప్పారు. పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే 13-14 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.
This post was last modified on May 31, 2024 12:02 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…