Political News

కూట‌మి సీట్ల‌పై చంద్ర‌బాబు ప‌క్కా అంచ‌నా!

టీడీపీ నేతృత్వంలోని బీజేపీ-జ‌న‌సేన కూట‌మి విజ‌యం ప‌రిస్థితి ఏంటి? వైసీపీని ఢీకొట్టి బ‌లంగా ముం దుకు వ‌స్తుందా? గెలుపు గుర్రం ఎక్కుతుందా? అనేది ఆస‌క్తిక ర విష‌యం. దీనిపై టీడీపీలో ఉన్న కీల‌క నాయ‌కులు ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా స్పందించ‌లేదు. మ‌రోవైపు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మా త్రం త‌న లెక్కులు తాను ప‌దే ప‌దే చెబుతున్నారు. ఎన్నిక‌లు ముగిశాక‌.. లండ‌న్‌కు వెళ్తూ.. ఆయ‌న ఓ జోస్యం చెప్పారు. ఇక‌, ప‌ర్య‌ట‌న ముగించుకుని రాబోయే ముందుకూడా జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

దీనిలోనూ తామే గెలుస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. వైసీపీ ఇంత దూకుడుగా ఉంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సహా కూట‌మి నాయ‌కులు, ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన ప‌వ‌న్ వంటి నేత‌లు ఎక్క‌డా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌డం లేదు. దీంతో అస‌లు ఏమైంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇదిలావుంటే.. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు తిరిగి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న అంచ‌నాల‌ను పార్టీ కీల‌క నేత‌ల‌కు వెల్ల‌డించారు.

అంత‌ర్గ‌త స‌మావేశంలో కీల‌క ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చించిన చంద్ర‌బాబు తాను చేయించిన స‌ర్వేలు.. ప్ర‌జ ల నాడి వంటివాటిని అంచ‌నా వేసుకుని.. కూట‌మికి ఎన్ని సీట్లు వ‌స్తాయో చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకు న్నారు. అత్యంత ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు చెప్పిన ఈ వివ‌రాలు.. విశ్వ‌స‌నీయ వ్య‌క్తుల‌కు టీడీపీ నేత‌లు లీక్ చేశారు. దీని ప్ర‌కారం.. కూట‌మి 110-122 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని చంద్ర బాబు లెక్క‌లు వేసుకున్నార‌ని చెప్పారు.

ఇక‌, మ‌హిళా ఓటు బ్యాంకు ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ప్ర‌యాణం వైపు ఉంద‌ని.. అందుకే మ‌హిళ‌లు క్యూ క‌ట్టి మ‌రీ ఓటేశార‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ పింఛ‌నును రూ.4000ల‌కు పెంచుతామ‌ని.. ఏప్రిల్ నుంచే రూ.1000 క‌లిపి ఇస్తామ‌ని చెప్ప‌డంతో వృద్ధులు త‌మ‌కు ఓటేశార‌ని.. బాబు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు వెల్ల‌డించారు. దీంతో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు న‌మ్ముతున్న‌ట్టు.. ధీమాగా ఉంటున్న‌ట్టు చెప్పారు. పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ ఒంట‌రిగానే 13-14 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు తెలిపారు.

This post was last modified on May 31, 2024 12:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

1 minute ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago