Political News

కూట‌మి సీట్ల‌పై చంద్ర‌బాబు ప‌క్కా అంచ‌నా!

టీడీపీ నేతృత్వంలోని బీజేపీ-జ‌న‌సేన కూట‌మి విజ‌యం ప‌రిస్థితి ఏంటి? వైసీపీని ఢీకొట్టి బ‌లంగా ముం దుకు వ‌స్తుందా? గెలుపు గుర్రం ఎక్కుతుందా? అనేది ఆస‌క్తిక ర విష‌యం. దీనిపై టీడీపీలో ఉన్న కీల‌క నాయ‌కులు ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా స్పందించ‌లేదు. మ‌రోవైపు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మా త్రం త‌న లెక్కులు తాను ప‌దే ప‌దే చెబుతున్నారు. ఎన్నిక‌లు ముగిశాక‌.. లండ‌న్‌కు వెళ్తూ.. ఆయ‌న ఓ జోస్యం చెప్పారు. ఇక‌, ప‌ర్య‌ట‌న ముగించుకుని రాబోయే ముందుకూడా జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

దీనిలోనూ తామే గెలుస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. వైసీపీ ఇంత దూకుడుగా ఉంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సహా కూట‌మి నాయ‌కులు, ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన ప‌వ‌న్ వంటి నేత‌లు ఎక్క‌డా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌డం లేదు. దీంతో అస‌లు ఏమైంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇదిలావుంటే.. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు తిరిగి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న అంచ‌నాల‌ను పార్టీ కీల‌క నేత‌ల‌కు వెల్ల‌డించారు.

అంత‌ర్గ‌త స‌మావేశంలో కీల‌క ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చించిన చంద్ర‌బాబు తాను చేయించిన స‌ర్వేలు.. ప్ర‌జ ల నాడి వంటివాటిని అంచ‌నా వేసుకుని.. కూట‌మికి ఎన్ని సీట్లు వ‌స్తాయో చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకు న్నారు. అత్యంత ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు చెప్పిన ఈ వివ‌రాలు.. విశ్వ‌స‌నీయ వ్య‌క్తుల‌కు టీడీపీ నేత‌లు లీక్ చేశారు. దీని ప్ర‌కారం.. కూట‌మి 110-122 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని చంద్ర బాబు లెక్క‌లు వేసుకున్నార‌ని చెప్పారు.

ఇక‌, మ‌హిళా ఓటు బ్యాంకు ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ప్ర‌యాణం వైపు ఉంద‌ని.. అందుకే మ‌హిళ‌లు క్యూ క‌ట్టి మ‌రీ ఓటేశార‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ పింఛ‌నును రూ.4000ల‌కు పెంచుతామ‌ని.. ఏప్రిల్ నుంచే రూ.1000 క‌లిపి ఇస్తామ‌ని చెప్ప‌డంతో వృద్ధులు త‌మ‌కు ఓటేశార‌ని.. బాబు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు వెల్ల‌డించారు. దీంతో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు న‌మ్ముతున్న‌ట్టు.. ధీమాగా ఉంటున్న‌ట్టు చెప్పారు. పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ ఒంట‌రిగానే 13-14 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు తెలిపారు.

This post was last modified on May 31, 2024 12:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

20 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

7 hours ago