ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. దాదాపు ఐదేళ్లుగా(మధ్యలో నాలుగు రోజులు మినహా) సస్పెన్ష న్లో ఉన్న ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) న్యాయ పోరాటం ఫలించింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన దరిమిలా.. ప్రభుత్వం దిగి వచ్చింది. గురువారమే రాష్ట్ర హైకోర్టుఈ విషయంపై తీర్పు వెలువరించింది.
ఆ వెంటనే ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని కలిసి.. అటు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయనకు అందించారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన విన్నవించారు. దీనిపై పరిశీలన చేసిన జవహర్రెడ్డి శుక్రవారం ఉదయం.. ఏబీవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ.. రాష్ట్ర డీజీపికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుదీర్ఘ న్యాయ పోరాటం.. అనంతరం సీనియర్ ఐపీఎస్కు పోస్టింగ్ లభించింది.
కొన్ని గంటల ముందు..
సీనియార్టీని బట్టి.. శుక్రవారం ఏబీపీ తన విధుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ రోజు మొత్తంలో ఆయన ఎప్పుడైనా రిటైర్ కావొచ్చు. నిబంధనల ప్రకారం .. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఆయనకు పోస్టులో కొనసాగే అవకాశంఉంది. ఈనేపథ్యంలో ఆయనకు సంబంధించి పోస్టింగ్ ఇస్తూ.. డీజీపీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. వెంటనే ఏబీవీ తన సీటులో కూర్చోనున్నారు. అయితే.. కొద్ది గంటలు మాత్రమే ఆయన ఈ పోస్టులో కూర్చునే అవకాశం ఉంది. అయితే.. ఆయన పోస్టింగులో కూర్చున్నా.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. రిటైర్ అవుతున్నవారు.. అఖిల భారత సర్వీసు నిబంధనల మేరకు.. ఎలాంటి నిర్ణయాలూ తీసుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం లేదు.
నైతిక విజయం
అయితే.. ఈ పోస్టింగ్ ద్వారా.. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు.. ఇతరత్రా సొమ్ములు.. అదేవిధంగా తుది పోస్టింగ్ ఆధారంగా పింఛను వంటి ప్రయోనాలు దక్కించుకోన్నారు. అయితే.. జగన్ సర్కారు వేధించిందని.. తనను రాచి రంపాన పెట్టిందని.. ఏబీవీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన సుదీర్ఘ పోరాటంలో సర్కారుపై నైతిక విజయం దక్కించుకోవడమే ఇప్పుడు ఆయనకు లభించిన భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.
This post was last modified on May 31, 2024 11:59 am
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…