ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. దాదాపు ఐదేళ్లుగా(మధ్యలో నాలుగు రోజులు మినహా) సస్పెన్ష న్లో ఉన్న ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) న్యాయ పోరాటం ఫలించింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన దరిమిలా.. ప్రభుత్వం దిగి వచ్చింది. గురువారమే రాష్ట్ర హైకోర్టుఈ విషయంపై తీర్పు వెలువరించింది.
ఆ వెంటనే ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని కలిసి.. అటు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయనకు అందించారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన విన్నవించారు. దీనిపై పరిశీలన చేసిన జవహర్రెడ్డి శుక్రవారం ఉదయం.. ఏబీవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ.. రాష్ట్ర డీజీపికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుదీర్ఘ న్యాయ పోరాటం.. అనంతరం సీనియర్ ఐపీఎస్కు పోస్టింగ్ లభించింది.
కొన్ని గంటల ముందు..
సీనియార్టీని బట్టి.. శుక్రవారం ఏబీపీ తన విధుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ రోజు మొత్తంలో ఆయన ఎప్పుడైనా రిటైర్ కావొచ్చు. నిబంధనల ప్రకారం .. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఆయనకు పోస్టులో కొనసాగే అవకాశంఉంది. ఈనేపథ్యంలో ఆయనకు సంబంధించి పోస్టింగ్ ఇస్తూ.. డీజీపీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. వెంటనే ఏబీవీ తన సీటులో కూర్చోనున్నారు. అయితే.. కొద్ది గంటలు మాత్రమే ఆయన ఈ పోస్టులో కూర్చునే అవకాశం ఉంది. అయితే.. ఆయన పోస్టింగులో కూర్చున్నా.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. రిటైర్ అవుతున్నవారు.. అఖిల భారత సర్వీసు నిబంధనల మేరకు.. ఎలాంటి నిర్ణయాలూ తీసుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం లేదు.
నైతిక విజయం
అయితే.. ఈ పోస్టింగ్ ద్వారా.. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు.. ఇతరత్రా సొమ్ములు.. అదేవిధంగా తుది పోస్టింగ్ ఆధారంగా పింఛను వంటి ప్రయోనాలు దక్కించుకోన్నారు. అయితే.. జగన్ సర్కారు వేధించిందని.. తనను రాచి రంపాన పెట్టిందని.. ఏబీవీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన సుదీర్ఘ పోరాటంలో సర్కారుపై నైతిక విజయం దక్కించుకోవడమే ఇప్పుడు ఆయనకు లభించిన భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.
This post was last modified on May 31, 2024 11:59 am
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…