ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. దాదాపు ఐదేళ్లుగా(మధ్యలో నాలుగు రోజులు మినహా) సస్పెన్ష న్లో ఉన్న ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) న్యాయ పోరాటం ఫలించింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన దరిమిలా.. ప్రభుత్వం దిగి వచ్చింది. గురువారమే రాష్ట్ర హైకోర్టుఈ విషయంపై తీర్పు వెలువరించింది.
ఆ వెంటనే ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని కలిసి.. అటు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయనకు అందించారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన విన్నవించారు. దీనిపై పరిశీలన చేసిన జవహర్రెడ్డి శుక్రవారం ఉదయం.. ఏబీవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ.. రాష్ట్ర డీజీపికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుదీర్ఘ న్యాయ పోరాటం.. అనంతరం సీనియర్ ఐపీఎస్కు పోస్టింగ్ లభించింది.
కొన్ని గంటల ముందు..
సీనియార్టీని బట్టి.. శుక్రవారం ఏబీపీ తన విధుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ రోజు మొత్తంలో ఆయన ఎప్పుడైనా రిటైర్ కావొచ్చు. నిబంధనల ప్రకారం .. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఆయనకు పోస్టులో కొనసాగే అవకాశంఉంది. ఈనేపథ్యంలో ఆయనకు సంబంధించి పోస్టింగ్ ఇస్తూ.. డీజీపీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. వెంటనే ఏబీవీ తన సీటులో కూర్చోనున్నారు. అయితే.. కొద్ది గంటలు మాత్రమే ఆయన ఈ పోస్టులో కూర్చునే అవకాశం ఉంది. అయితే.. ఆయన పోస్టింగులో కూర్చున్నా.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. రిటైర్ అవుతున్నవారు.. అఖిల భారత సర్వీసు నిబంధనల మేరకు.. ఎలాంటి నిర్ణయాలూ తీసుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం లేదు.
నైతిక విజయం
అయితే.. ఈ పోస్టింగ్ ద్వారా.. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు.. ఇతరత్రా సొమ్ములు.. అదేవిధంగా తుది పోస్టింగ్ ఆధారంగా పింఛను వంటి ప్రయోనాలు దక్కించుకోన్నారు. అయితే.. జగన్ సర్కారు వేధించిందని.. తనను రాచి రంపాన పెట్టిందని.. ఏబీవీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన సుదీర్ఘ పోరాటంలో సర్కారుపై నైతిక విజయం దక్కించుకోవడమే ఇప్పుడు ఆయనకు లభించిన భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.
This post was last modified on May 31, 2024 11:59 am
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…