టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు పూర్తిస్థాయిలో బిజీ అయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన ఎలా అయితే..బిజీ అయ్యారో.. ఇప్పుడు మరోసారి అంతే బిజీ అయ్యారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితం విడుదల కానున్న నేపథ్యంలో పార్టీ నేతలను చంద్రబాబు అలెర్ట్ చేశారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి… ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు రావాలని కొందరు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. పోలింగ్ తర్వాత. మెజారిటీ నాయకుల విదేశాలకు వెళ్లారు.
మరికొందరు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఫలితం కోసం నెలకొన్న టెన్షన్ నుంచి బయట పడేందుకు ప్ర యత్నించారు. కానీ, ఎన్నికల పోలింగ్ ఫలితం రావడానికి నాలుగు రోజుల ముందే నియోజకవర్గాలకు రావాలని.. వైసీపీ వ్యూహాలను ఎత్తగడలను కూడా.. అడ్డు కోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన విశ్రాంతి తీసుకుంటున్న నాయకులను హెచ్చరించారు. ఇక, హనీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాలని సూచించారు.
దీంతో విదేశాలకు వెళ్లిన నాయకులు ఏపీకి క్యూ కట్టారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో మరోసారి సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తల్లోనూ హుషారు చోటు చేసుకుంది. అయితే.. టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. దీంతో చంద్రబాబు పదే పదే టెన్షన్ వద్దని… ఎవరూ తొందర పాటుచర్యలకు పాల్పడవద్దని కూడా సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఇదే విషయాన్ని టెలీ కాన్ఫరెన్స్ పెట్టిమరీ చెప్పారు.
గెలుపు గ్యారెంటీ అని. ఈ విషయంలో సందేహం లేదని.. అలాగని ఎవరూ నిర్లక్ష్యంగ ఉండొద్దని కూడా.. చంద్రబాబు సూచించారు. పోలింగ్ ఏజెంట్లను ఎంపిక చేసుకోవడం.. సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిం చడం.. వంటివి ఖచ్చితంగా చూడాలన్నారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగితే దీటుగా సమాధానం చెప్పాలని కూడా సూచించారు. మొత్తానికి చంద్రబాబు శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు.
This post was last modified on May 31, 2024 10:06 am
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…