Political News

హ‌నీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాలి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుడు పూర్తిస్థాయిలో బిజీ అయ్యారు. ఎన్నికల స‌మ‌యంలో ఆయ‌న ఎలా అయితే..బిజీ అయ్యారో.. ఇప్పుడు మ‌రోసారి అంతే బిజీ అయ్యారు. మ‌రో 4 రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు అలెర్ట్ చేశారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి… ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఒక రోజు ముందు రావాల‌ని కొంద‌రు త‌మ్ముళ్లు నిర్ణ‌యించుకున్నారు. పోలింగ్ త‌ర్వాత‌. మెజారిటీ నాయ‌కుల విదేశాల‌కు వెళ్లారు.

మ‌రికొంద‌రు.. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లారు. ఫ‌లితం కోసం నెల‌కొన్న టెన్ష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర యత్నించారు. కానీ, ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితం రావ‌డానికి నాలుగు రోజుల ముందే నియోజ‌క‌వ‌ర్గాల‌కు రావాల‌ని.. వైసీపీ వ్యూహాల‌ను ఎత్త‌గ‌డ‌ల‌ను కూడా.. అడ్డు కోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్న నాయ‌కుల‌ను హెచ్చ‌రించారు. ఇక‌, హ‌నీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాల‌ని సూచించారు.

దీంతో విదేశాల‌కు వెళ్లిన నాయ‌కులు ఏపీకి క్యూ క‌ట్టారు. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన వారు కూడా తిరిగి వ‌స్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రోసారి సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల్లోనూ హుషారు చోటు చేసుకుంది. అయితే.. టెన్ష‌న్ మాత్రం కొన‌సాగుతోంది. దీంతో చంద్ర‌బాబు ప‌దే ప‌దే టెన్ష‌న్ వ‌ద్ద‌ని… ఎవ‌రూ తొంద‌ర పాటుచ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కూడా సూచిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఇదే విష‌యాన్ని టెలీ కాన్ఫ‌రెన్స్ పెట్టిమరీ చెప్పారు.

గెలుపు గ్యారెంటీ అని. ఈ విష‌యంలో సందేహం లేద‌ని.. అలాగ‌ని ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగ ఉండొద్ద‌ని కూడా.. చంద్ర‌బాబు సూచించారు. పోలింగ్ ఏజెంట్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం.. స‌ర‌ళిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిం చ‌డం.. వంటివి ఖ‌చ్చితంగా చూడాల‌న్నారు. వైసీపీ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగితే దీటుగా స‌మాధానం చెప్పాల‌ని కూడా సూచించారు. మొత్తానికి చంద్ర‌బాబు శ్రేణులను ప‌రుగులు పెట్టిస్తున్నారు.

This post was last modified on May 31, 2024 10:06 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

1 hour ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

2 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

3 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

5 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

6 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

6 hours ago