Political News

హ‌నీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాలి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుడు పూర్తిస్థాయిలో బిజీ అయ్యారు. ఎన్నికల స‌మ‌యంలో ఆయ‌న ఎలా అయితే..బిజీ అయ్యారో.. ఇప్పుడు మ‌రోసారి అంతే బిజీ అయ్యారు. మ‌రో 4 రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు అలెర్ట్ చేశారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి… ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఒక రోజు ముందు రావాల‌ని కొంద‌రు త‌మ్ముళ్లు నిర్ణ‌యించుకున్నారు. పోలింగ్ త‌ర్వాత‌. మెజారిటీ నాయ‌కుల విదేశాల‌కు వెళ్లారు.

మ‌రికొంద‌రు.. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లారు. ఫ‌లితం కోసం నెల‌కొన్న టెన్ష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర యత్నించారు. కానీ, ఎన్నిక‌ల పోలింగ్ ఫ‌లితం రావ‌డానికి నాలుగు రోజుల ముందే నియోజ‌క‌వ‌ర్గాల‌కు రావాల‌ని.. వైసీపీ వ్యూహాల‌ను ఎత్త‌గ‌డ‌ల‌ను కూడా.. అడ్డు కోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్న నాయ‌కుల‌ను హెచ్చ‌రించారు. ఇక‌, హ‌నీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాల‌ని సూచించారు.

దీంతో విదేశాల‌కు వెళ్లిన నాయ‌కులు ఏపీకి క్యూ క‌ట్టారు. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన వారు కూడా తిరిగి వ‌స్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రోసారి సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల్లోనూ హుషారు చోటు చేసుకుంది. అయితే.. టెన్ష‌న్ మాత్రం కొన‌సాగుతోంది. దీంతో చంద్ర‌బాబు ప‌దే ప‌దే టెన్ష‌న్ వ‌ద్ద‌ని… ఎవ‌రూ తొంద‌ర పాటుచ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కూడా సూచిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఇదే విష‌యాన్ని టెలీ కాన్ఫ‌రెన్స్ పెట్టిమరీ చెప్పారు.

గెలుపు గ్యారెంటీ అని. ఈ విష‌యంలో సందేహం లేద‌ని.. అలాగ‌ని ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగ ఉండొద్ద‌ని కూడా.. చంద్ర‌బాబు సూచించారు. పోలింగ్ ఏజెంట్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం.. స‌ర‌ళిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిం చ‌డం.. వంటివి ఖ‌చ్చితంగా చూడాల‌న్నారు. వైసీపీ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగితే దీటుగా స‌మాధానం చెప్పాల‌ని కూడా సూచించారు. మొత్తానికి చంద్ర‌బాబు శ్రేణులను ప‌రుగులు పెట్టిస్తున్నారు.

This post was last modified on May 31, 2024 10:06 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago