Political News

పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్‌

ఏపీలో తీవ్ర వివాదంగా మారిన‌..ఉద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులు(85 ఏళ్లు  పైబ‌డిన‌) వినియోగించుకున్న పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని గంట‌ల్లోనే యూట‌ర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్న నిర్ణ‌యాన్ని తొలుత స‌మ‌ర్థించిన ఎన్నిక‌ల సంఘం.. ఈ కేసు హైకోర్టు కు వెళ్లే స‌రికి యూట‌ర్న్ తీసుకుని.. స‌ద‌రు మీనా తీసుకున్న‌నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని ర‌ద్దు చేస్తున్న‌ట్టుకు తెలిపింది. దీంతో ఏపీలో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో 4 ల‌క్ష‌ల 97 వేల 620 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో మెజారిటీగా 3.8 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే.. ఇది త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని టీడీపీ ఆది నుంచి చెబుతూ వ‌చ్చింది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మదే విజ‌య‌మ‌ని భావించిన వైసీపీ నేత‌ల గుండెల్లో గుబులు పుట్టించింది. దీంతో నిబంధ‌న‌ల మేర‌కు.. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించాల‌ని చెబుతూ వ‌చ్చింది. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ముఖ్యం కాబ‌ట్టి.. కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని టీడీపీ విన్న‌వించింది. దీంతో ఏపీ ఎన్నిక‌ల అధికారిగా ఉన్న మీనా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తూ.. మెమో ఒక‌టి జారీ చేశారు.

ఏంటి నిబంధ‌న‌..

పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకునేవారి విష‌యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. పోస్ట‌ల్ బ్యాలెట్‌పై అటెస్టేష‌న్ అధికారి సీల్ వేయాలి. 2) ఆయ‌న చేతి రాత‌తో సంత‌కం చేయాలి. ఉద్యోగి కూడా అలానే సంత‌కం చేయాలి.

ఏం స‌వ‌రించారు..

పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే స‌రిపోతుంద‌ని. సీల్ లేకపోయినా ఫర్వాలేదని,  హోదాను చేతిరాతతో రాయకపోయినా ఏమీ కాద‌ని పేర్కొన్నారు.

ఇదీ వివాదం..

ఇలా .. సీఈవో మీనా.. మార్పులు చేయ‌డాన్ని వైసీపీ నిల‌దీసింది. ఇలా ఎందుకు మారుస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. ఇలా చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. దీనికి ఈసీ నుంచి స‌మాధానం వ‌చ్చింది. మీనా ఇచ్చిన ఉత్త‌ర్వులు.. స‌రైన‌వేన‌ని తెలిపింది.

కోర్టులో మాట మార్పు..

అయితే.. వైసీపీ  ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకువెళ్లింది. అక్క‌డ‌కు వెళ్లే స‌రికి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్ తీసుకుని.. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా ఫర్వాలేదంటూ ఏపీ సీఈవో  ఇచ్చిన మెమోను వెన‌క్కి తీసుకుంది.  పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం(13ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం చేయాల‌ని..   స్టాంప్ వేయాల‌ని తెలిపింది.  అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని తెలిపింది.  అయితే.. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఎందుకంటే.. మ‌రోసారి తామే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on May 31, 2024 12:02 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

52 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago