Political News

పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్‌

ఏపీలో తీవ్ర వివాదంగా మారిన‌..ఉద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులు(85 ఏళ్లు  పైబ‌డిన‌) వినియోగించుకున్న పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని గంట‌ల్లోనే యూట‌ర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్న నిర్ణ‌యాన్ని తొలుత స‌మ‌ర్థించిన ఎన్నిక‌ల సంఘం.. ఈ కేసు హైకోర్టు కు వెళ్లే స‌రికి యూట‌ర్న్ తీసుకుని.. స‌ద‌రు మీనా తీసుకున్న‌నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని ర‌ద్దు చేస్తున్న‌ట్టుకు తెలిపింది. దీంతో ఏపీలో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో 4 ల‌క్ష‌ల 97 వేల 620 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో మెజారిటీగా 3.8 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే.. ఇది త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని టీడీపీ ఆది నుంచి చెబుతూ వ‌చ్చింది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మదే విజ‌య‌మ‌ని భావించిన వైసీపీ నేత‌ల గుండెల్లో గుబులు పుట్టించింది. దీంతో నిబంధ‌న‌ల మేర‌కు.. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించాల‌ని చెబుతూ వ‌చ్చింది. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ముఖ్యం కాబ‌ట్టి.. కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని టీడీపీ విన్న‌వించింది. దీంతో ఏపీ ఎన్నిక‌ల అధికారిగా ఉన్న మీనా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తూ.. మెమో ఒక‌టి జారీ చేశారు.

ఏంటి నిబంధ‌న‌..

పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకునేవారి విష‌యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. పోస్ట‌ల్ బ్యాలెట్‌పై అటెస్టేష‌న్ అధికారి సీల్ వేయాలి. 2) ఆయ‌న చేతి రాత‌తో సంత‌కం చేయాలి. ఉద్యోగి కూడా అలానే సంత‌కం చేయాలి.

ఏం స‌వ‌రించారు..

పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే స‌రిపోతుంద‌ని. సీల్ లేకపోయినా ఫర్వాలేదని,  హోదాను చేతిరాతతో రాయకపోయినా ఏమీ కాద‌ని పేర్కొన్నారు.

ఇదీ వివాదం..

ఇలా .. సీఈవో మీనా.. మార్పులు చేయ‌డాన్ని వైసీపీ నిల‌దీసింది. ఇలా ఎందుకు మారుస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. ఇలా చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. దీనికి ఈసీ నుంచి స‌మాధానం వ‌చ్చింది. మీనా ఇచ్చిన ఉత్త‌ర్వులు.. స‌రైన‌వేన‌ని తెలిపింది.

కోర్టులో మాట మార్పు..

అయితే.. వైసీపీ  ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకువెళ్లింది. అక్క‌డ‌కు వెళ్లే స‌రికి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్ తీసుకుని.. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా ఫర్వాలేదంటూ ఏపీ సీఈవో  ఇచ్చిన మెమోను వెన‌క్కి తీసుకుంది.  పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం(13ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం చేయాల‌ని..   స్టాంప్ వేయాల‌ని తెలిపింది.  అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని తెలిపింది.  అయితే.. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఎందుకంటే.. మ‌రోసారి తామే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on May 31, 2024 12:02 am

Share

Recent Posts

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…

50 minutes ago

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

3 hours ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

3 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

3 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

4 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

5 hours ago