ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరూ తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు. సీనియర్ నాయకుడు బూచేపల్లికి, కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబ పరం గా చూస్తే.. మంచి సంబంధాలు.. ప్రజలతో గట్టి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరూ గట్టి పోటీనే ఇచ్చా రు.
దీనికితోడు రాష్ట్రంలోనే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగి 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ చిత్రమై న వ్యవహారం ఒకటి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నేతలు గెలవాలని కోరుకుంటారు. ఎక్కడైనా బద్ధ వ్యతిరేకులు ఉంటే తప్ప.. అందరూ సవ్యంగా తమ నాయకులు గెలుపు గుర్రం ఎక్కాలని కూడా అభిలషిస్తారు. కానీ.. వైసీపీలోనే ఉన్న కీలక నేత ఒకరు.. టీడీపీ కోసం అంతర్గతంగా చక్రం తిప్పా రని అంటున్నారు స్థానికులు.
ప్రస్తుతం సదరు నేతపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆయన ఎవరనేది అందరికీ తెలిసినా.. పేరు మాత్రం బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు గతంలో టీడీపీలో మంచి అనుబంధం ఉంది. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో టికెట్ కూడా ఆశించారు. కానీ, దక్కలేదు. దీంతో వైసీపీలోనే ఉండిపోయారు. పైకి మాత్రం మౌనంగా ఉన్నా.. అంతర్గతంగా టీడీపీ గెలవాలని కోరుకున్నారని.. పూజలు కూడా చేయించారని సమాచారం.
దీనికి కారణం.. వైసీపీలో ఉన్న తనకు ప్రాధాన్యం లేకుండా పోవడం.. తమపనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం.. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం వంటి కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్టు సమాచారం. రేపు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. ఈయన చేసిన పూజలు ఫలించి టీడీపీ కనుక గెలిస్తే.. ఈయనపై చర్యలకు వైసీపీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2024 7:31 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…