ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరూ తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు. సీనియర్ నాయకుడు బూచేపల్లికి, కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబ పరం గా చూస్తే.. మంచి సంబంధాలు.. ప్రజలతో గట్టి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరూ గట్టి పోటీనే ఇచ్చా రు.
దీనికితోడు రాష్ట్రంలోనే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగి 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ చిత్రమై న వ్యవహారం ఒకటి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నేతలు గెలవాలని కోరుకుంటారు. ఎక్కడైనా బద్ధ వ్యతిరేకులు ఉంటే తప్ప.. అందరూ సవ్యంగా తమ నాయకులు గెలుపు గుర్రం ఎక్కాలని కూడా అభిలషిస్తారు. కానీ.. వైసీపీలోనే ఉన్న కీలక నేత ఒకరు.. టీడీపీ కోసం అంతర్గతంగా చక్రం తిప్పా రని అంటున్నారు స్థానికులు.
ప్రస్తుతం సదరు నేతపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆయన ఎవరనేది అందరికీ తెలిసినా.. పేరు మాత్రం బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు గతంలో టీడీపీలో మంచి అనుబంధం ఉంది. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో టికెట్ కూడా ఆశించారు. కానీ, దక్కలేదు. దీంతో వైసీపీలోనే ఉండిపోయారు. పైకి మాత్రం మౌనంగా ఉన్నా.. అంతర్గతంగా టీడీపీ గెలవాలని కోరుకున్నారని.. పూజలు కూడా చేయించారని సమాచారం.
దీనికి కారణం.. వైసీపీలో ఉన్న తనకు ప్రాధాన్యం లేకుండా పోవడం.. తమపనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం.. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం వంటి కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్టు సమాచారం. రేపు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. ఈయన చేసిన పూజలు ఫలించి టీడీపీ కనుక గెలిస్తే.. ఈయనపై చర్యలకు వైసీపీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2024 7:31 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…