Political News

1982 దాకా గాంధీ ఎవరో తెలియదట ?

జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గత 75 ఏండ్ల కాలంలో గాంధీకి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు అని మోడీ అన్నారు.

‘సినిమా  తీసిన తర్వాతనే అతను ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రపంచం ఆసక్తి చూపిందని,  చేయాల్సిన పని మనం చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే, మహాత్మా గాంధీ కూడా వారికంటే తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరిగిన తర్వాత తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. గాంధీజీ ద్వారా భారతదేశాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీనికి రిచర్డ్‌ అటెన్‌బరో దర్శకత్వం వహించారు.

మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ‘గెట్ వెల్ సూన్.. దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు’  తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో మోడీ ఫోటోతో పోస్టు చేసింది. గాంధీ వారసత్వాన్ని మోదీ నాశనం చేస్తున్నారని,  మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలియదని చెబుతున్న త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న మోదీ.. ఆయన ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తనకు తెలియడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కారే నాశనం చేసిందని ఆరోపించారు. 

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago