Political News

పులివెందులలో పది వేల మందితో సభ పెడతా-రఘురామ

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ (నరసాపురం) రఘురామ కృష్ణంరాజు.. తనను విమర్శించి నాయకులకు మరోసారి తనదైన శైలిలో బదులిచ్చారు. తన తోలు తీస్తామంటూ వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘నా తోలు తీస్తామంటూ కొందరు నాయకులు మాట్లాడతారు. కానీ నేనలా మాట్లాడలేను. ఎందుకంటే తోలు తీయడం నా వృత్తి కాదు. అలా మాట్లాడుతున్న వాళ్లు బహుభాషా కోవిదులు. నాకు అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా… నా అంతరంగంలో మాట్లాడతాను కానీ.. బహిరంగంగా ఆ భాష వాడను. ప్రజలు అసహ్యించుకొనేలా … ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం ఉన్నారు. వాళ్లు నా మాట వినండి. అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారు’’ అని రఘురామ అన్నారు.

తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్లకు మూణ్నాలుగు రోజుల్లో సరైన బదులు వస్తుందని అంత వరకు ఎదురు చూడాలని రఘురామ వ్యాఖ్యానించారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని.. తనను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని.. రాయలసీమలో కూడా తనకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారని.. కరోనా ప్రభావం తగ్గితే పది వేల మందితో పులివెందులలో కూడా సభ పెట్టగల దమ్ము తనకుందని ఆయన పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.. కానీ తనను బహిష్కరించే దమ్ము మాత్రం వారికి లేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారని.. న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందని అన్న రఘురామ.. తనకు మాత్రం ఆ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని.. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ చిరంజీవులు అని ఆయన అన్నారు. అమరావతి రైతులు ఏమాత్రం భయపడొద్దని, వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని రఘురామ భరోసా ఇచ్చారు.

This post was last modified on September 18, 2020 9:40 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

19 minutes ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

39 minutes ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

4 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

4 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

7 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

9 hours ago