Political News

పులివెందులలో పది వేల మందితో సభ పెడతా-రఘురామ

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ (నరసాపురం) రఘురామ కృష్ణంరాజు.. తనను విమర్శించి నాయకులకు మరోసారి తనదైన శైలిలో బదులిచ్చారు. తన తోలు తీస్తామంటూ వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘నా తోలు తీస్తామంటూ కొందరు నాయకులు మాట్లాడతారు. కానీ నేనలా మాట్లాడలేను. ఎందుకంటే తోలు తీయడం నా వృత్తి కాదు. అలా మాట్లాడుతున్న వాళ్లు బహుభాషా కోవిదులు. నాకు అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా… నా అంతరంగంలో మాట్లాడతాను కానీ.. బహిరంగంగా ఆ భాష వాడను. ప్రజలు అసహ్యించుకొనేలా … ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం ఉన్నారు. వాళ్లు నా మాట వినండి. అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారు’’ అని రఘురామ అన్నారు.

తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్లకు మూణ్నాలుగు రోజుల్లో సరైన బదులు వస్తుందని అంత వరకు ఎదురు చూడాలని రఘురామ వ్యాఖ్యానించారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని.. తనను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని.. రాయలసీమలో కూడా తనకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారని.. కరోనా ప్రభావం తగ్గితే పది వేల మందితో పులివెందులలో కూడా సభ పెట్టగల దమ్ము తనకుందని ఆయన పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.. కానీ తనను బహిష్కరించే దమ్ము మాత్రం వారికి లేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారని.. న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందని అన్న రఘురామ.. తనకు మాత్రం ఆ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని.. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ చిరంజీవులు అని ఆయన అన్నారు. అమరావతి రైతులు ఏమాత్రం భయపడొద్దని, వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని రఘురామ భరోసా ఇచ్చారు.

This post was last modified on September 18, 2020 9:40 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

2 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

3 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

4 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

4 hours ago