తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మారబోతున్నారా? అధ్యక్షురాలిగా సీతక్క బాధ్యతలు తీసుకోవడం ఖాయమా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫలితాల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని హైకమాండ్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తర్వాత ప్రెసిడెంట్ ఎవరూ అనే చర్చ జోరందుకుంది. ఇందులో సీతక్క వైపే అందరూ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ పదవిని దక్కించుకునేందుకు తెలంగాణలో పోటీ మాములూగా ఉండదు. సీనియర్ నాయకులు ఈ పదవిపై ఆశతోనే ఉంటారు. గతంలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఎలాంటి వ్యతిరేకత చెలరేగిందో చూశాం. కానీ రేవంత్ అవేమీ పట్టించుకోకుండా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్కుమార్, మధుయాష్కీ తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. వీళ్లలో ఏ ఒకరికి ఆ పదవి ఇచ్చినా ఇతరుల నుంచి అసంతృప్తి తప్పదు.
అందుకే ఈ గొడవలేమీ ఉండకుండా సీతక్క పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిగా చేస్తే ఏ నాయకుడి నుంచి కూడా వ్యతిరేకత రాదని పార్టీ భావిస్తోందని సమాచారం. సీతక్క ఎంపిక అందరికీ ఆమోదంగానే ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ దక్కే అవకాశముంది. అలాగే మహిళల నుంచి పార్టీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని హైకమాండ్ ఆలోచిస్తుందని టాక్. మరి తెలంగాణలో పీసీసీ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సీతక్క ముందుకు వస్తారా? అన్నదే ప్రశ్న.
This post was last modified on May 25, 2024 4:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…