జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తేదీ ఇది. మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి వచ్చాక జూన్ 9న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకునే డేట్ అయితే ఫిక్స్ చేశారు కానీ ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది. జూన్ 4న ఆ సస్పెన్స్కు తెరపడుతుంది. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సారి ఏపీలో కూటమిదే అధికారమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఈ విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తామే రెండో సారి అధికారంలోకి వస్తామని, జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి నుంచి ఆ పార్టీ నేతలందరి వరకూ అదే మాట. కానీ వీళ్లు పగటి కలలు కనడం మానాలని టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. జూన్ 9న సీఎంగా బాధ్యతలు స్వీకరించేది బాబే అని తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ నేతలనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు.
మరోవైపు ఇది విశాఖ వర్సెస్ అమరావతి పోరుగానూ మారింది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన చేస్తారని వైసీపీ చెబుతోంది. ఇప్పటికే అక్కడి రుషికొండపై కార్యాలయాలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు బాబు సీఎం అయితే మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం ఉంది. మరి ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.
This post was last modified on May 24, 2024 9:46 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…