జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తేదీ ఇది. మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి వచ్చాక జూన్ 9న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకునే డేట్ అయితే ఫిక్స్ చేశారు కానీ ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది. జూన్ 4న ఆ సస్పెన్స్కు తెరపడుతుంది. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సారి ఏపీలో కూటమిదే అధికారమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఈ విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తామే రెండో సారి అధికారంలోకి వస్తామని, జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి నుంచి ఆ పార్టీ నేతలందరి వరకూ అదే మాట. కానీ వీళ్లు పగటి కలలు కనడం మానాలని టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. జూన్ 9న సీఎంగా బాధ్యతలు స్వీకరించేది బాబే అని తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ నేతలనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు.
మరోవైపు ఇది విశాఖ వర్సెస్ అమరావతి పోరుగానూ మారింది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన చేస్తారని వైసీపీ చెబుతోంది. ఇప్పటికే అక్కడి రుషికొండపై కార్యాలయాలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు బాబు సీఎం అయితే మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం ఉంది. మరి ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.
This post was last modified on May 24, 2024 9:46 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…