చెరపకురా.. చెడేవు! అన్నట్టుగా ఉంది.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సమయంలో ఆయన, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో సృష్టించిన అలజడి.. వారితోనే కాకుండా.. కీలకమైన.. ఐఏఎస్ అధికారులకు కూడా.. చుట్టుకుంటోంది. ఇంత దారుణం జరిగిన తర్వాత.. ఈ విషయాన్ని దాచి పెట్టిన కలెక్టర్ లోతేటి శివశంకర్ను అధికారులు బదిలీ చేశారు. దీంతో అంతా అయిపోయిందని అనుకున్నారు.
కానీ, అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మాచర్లలోని పాలవాయి గేటు ఎన్నికల బూత్లో ఈవీఎంను, వీవీ ప్యాట్ ను ధ్వంసం చేసిన విషయం తెలిసి కూడా.. కీలకమైన అధికారి ఒకరు.. దాచి పెట్టారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు అందరి వేళ్లూ ఆయన వైపేచూపిస్తున్నాయి. ఆయన పూర్తిగా సహకరించారని.. అందుకే.. ఘటన జరిగిన తర్వాత.. వారం రోజుల వరకు కూడా.. ఈ విషయం వెలుగు చూడలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దీంతో ఆయనపై నే చర్యలు కోరాలని.. ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈయనతోపాటు.. మరో కీలక అధికారి.. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగంపై పట్టున్న అధికారి కూడా.. ఈ విషయాన్ని దాచి.. వైసీపీ ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి.
అదేవిధంగా మరో ఐపీఎస్ అధికారి ఏకంగా.. పోలీసుల ఆనుపానులను.. ప్రత్యేక దర్యాప్తు బృందాల పరిశీలనను ఎక్కడికి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని విచారిస్తున్నారు..? అనే విషయాలను కూడా పిన్నెల్లికి చేరవేశారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఉన్నతాధికారుల మెడకు కూడా.. పిన్నెల్లి వ్యవహారం చుట్టుకుందనే వాదన వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఏమయ్యారు? ఏంచేశారనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. సిట్ బృందాలు రంగంలోకి దిగేవరకు.. ఎందుకు ఈ ఘటనను దాచిపెట్టారనే కోణంలోనూ ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. దీంతో మరో రెండు మూడు రోజుల్లో అయినా.. వీరి పైనా చర్యలు ఉంటాయని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on May 23, 2024 5:48 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…