Political News

మోడీ మిత్రుల్లో చంద్రబాబే బెస్ట్ అట

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ..మిత్రపక్షాలతో కలిసి రెండు సార్లు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పదేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న మోడీపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో లుకలుకలు, ఇండియా కూటమికి నాయకత్వలేమి వంటి విషయాల నేపథ్యంలో ఈసారి కూడా మోడీ విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, బిజెపితో పొత్తు పెట్టుకున్న వివిధ రాష్ట్రాలలోని మిత్రపక్ష పార్టీలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తేనే ఎన్డీఏ కూటమి గెలుపు సాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఇన్వెస్టర్ రుచిర్ శర్మ సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుందని, అయితే ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మినహా మిగతా పార్టీలు రాణించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటిదాకా జరిగిన 5 దశల ఎన్నికల్లో బిహార్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్డీఏ భాగస్వాములైన పార్టీలు ఆశించిన స్థాయిలో రాణించలేదని, అది మోడీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శర్మ వంటి రాజకీయ విశ్లేషకుల మాటలను బట్టి ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్ జగన్ పై ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు సమర్ధత కూటమిని గెలిపిస్తుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్ష పార్టీలు గెలిచే ఎంపీల సంఖ్య కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ, జనసేన ఎక్కువ ఎంపి స్థానాలు గెలుచుకొని అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

35 minutes ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

40 minutes ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

55 minutes ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

2 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

2 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

3 hours ago