ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే విజయవాడ పేరే ప్రధానంగా వినిపించేదే. ఆ తర్వాత రాయలసీమ రేసులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖపట్నం చుట్టూనే పొలిటికల్ హీట్ నెలకొందనే చెప్పాలి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి నేతల కళ్లు విశాఖపైనే పడ్డాయి. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధాని అని పేర్కొంటూ ఇక్కడే వైసీపీ మకాం వేస్తోంది.
జగన్ మళ్లీ అధికారంలో వస్తే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని వైసీపీ చెబుతోంది. ఇందుకు అనుకూలంగా రుషికొండపై భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు టీడీపీ కూడా విశాఖపై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది.
ఇటీవల టీడీపీ నాయకులు తరచుగా విశాఖపట్నానికి వెళ్లివస్తున్నారు. విజయవాడ, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పుడు విశాఖపై మనసు పడుతున్నారు.
పోలింగ్ ముగిశాక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా విశాఖ వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇదే వరుసలో మరికొంతమంది టీడీపీ నాయకులు విశాఖకు వచ్చే అవకాశముంది.
విశాఖలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేతలు విశాఖకు వెళ్తున్నా కూటమి అధికారంలోకి వచ్చాక అందరూ అమరావతిలోనే ఉండిపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 23, 2024 3:45 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…