ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే విజయవాడ పేరే ప్రధానంగా వినిపించేదే. ఆ తర్వాత రాయలసీమ రేసులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖపట్నం చుట్టూనే పొలిటికల్ హీట్ నెలకొందనే చెప్పాలి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి నేతల కళ్లు విశాఖపైనే పడ్డాయి. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధాని అని పేర్కొంటూ ఇక్కడే వైసీపీ మకాం వేస్తోంది.
జగన్ మళ్లీ అధికారంలో వస్తే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని వైసీపీ చెబుతోంది. ఇందుకు అనుకూలంగా రుషికొండపై భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు టీడీపీ కూడా విశాఖపై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది.
ఇటీవల టీడీపీ నాయకులు తరచుగా విశాఖపట్నానికి వెళ్లివస్తున్నారు. విజయవాడ, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పుడు విశాఖపై మనసు పడుతున్నారు.
పోలింగ్ ముగిశాక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా విశాఖ వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇదే వరుసలో మరికొంతమంది టీడీపీ నాయకులు విశాఖకు వచ్చే అవకాశముంది.
విశాఖలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేతలు విశాఖకు వెళ్తున్నా కూటమి అధికారంలోకి వచ్చాక అందరూ అమరావతిలోనే ఉండిపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 23, 2024 3:45 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…