Political News

విశాఖ చుట్టూ పొలిటిక‌ల్ హీట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయం అంటే విజ‌య‌వాడ పేరే ప్ర‌ధానంగా వినిపించేదే. ఆ త‌ర్వాత రాయ‌ల‌సీమ రేసులోకి వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖ‌ప‌ట్నం చుట్టూనే పొలిటిక‌ల్ హీట్ నెలకొంద‌నే చెప్పాలి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి నేత‌ల క‌ళ్లు విశాఖ‌పైనే ప‌డ్డాయి. ఇప్ప‌టికే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని అని పేర్కొంటూ ఇక్క‌డే వైసీపీ మ‌కాం వేస్తోంది.

జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తే విశాఖ నుంచే పాల‌న కొన‌సాగిస్తార‌ని వైసీపీ చెబుతోంది. ఇందుకు అనుకూలంగా రుషికొండ‌పై భ‌వ‌నాలు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు టీడీపీ కూడా విశాఖ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల టీడీపీ నాయ‌కులు త‌రచుగా విశాఖ‌ప‌ట్నానికి వెళ్లివ‌స్తున్నారు. విజ‌య‌వాడ‌, నెల్లూరు త‌దిత‌ర జిల్లాల‌కు చెందిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు విశాఖ‌పై మ‌న‌సు ప‌డుతున్నారు.

పోలింగ్ ముగిశాక విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విశాఖ వ‌చ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనేన‌ని స్ప‌ష్టం చేశారు.

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కూడా విశాఖ వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. ఇదే వ‌రుస‌లో మ‌రికొంత‌మంది టీడీపీ నాయ‌కులు విశాఖ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

విశాఖ‌లో వైసీపీ ఆధిప‌త్యానికి గండికొట్టేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేత‌లు విశాఖ‌కు వెళ్తున్నా కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక అంద‌రూ అమ‌రావ‌తిలోనే ఉండిపోతార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 23, 2024 3:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Vizag

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

2 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

3 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

3 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

3 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

6 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

7 hours ago