Political News

షాకింగ్‌: మోడీకి.. ఓవైసీ మ‌ద్ద‌తు.. !

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్య‌వ‌హ‌రించే ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గ‌త కొన్నాళ్లుగా ప్ర‌క‌టిస్తున్న పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)ను తిరిగి తీసుకుంటామ‌న్న వ్య‌వ‌హారంపై అస‌దుద్దీన్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తాము కూడా మ‌ద్ద‌తిస్తామ‌ని.. తాము కూడా కోరుకుంటున్న‌ది ఇదేన‌ని తేల్చి చెప్పారు. పీవోకే.. భార‌త్‌లో అంత‌ర్భాగ‌మ‌ని తాము ఆది నుంచి చెబుతున్న‌ట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. త‌మ మాట‌ల‌ను అప్ప‌ట్లో ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా పీవోకే వెన‌క్కి తీసుకుంటామంటే.. త‌మ మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌న్నారు.

“పీవోకే భార‌త్ భూ భాగ‌మే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. వెన‌క్కి తీసుకుంటే మేం హ‌ర్షిస్తాం. మ‌ద్ద‌తిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కానీ, అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్నారు.

కేవ‌లం ఎన్నిక‌ల కోసం.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు మోడీ బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఓవైసీ దుయ్య‌బ‌ట్టారు. బీజేపీకి 400 సీట్టు వ‌స్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని.. ఎలా 400 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌శ్నిస్తే.. మాత్రం స‌మాధానం చెప్ప‌లేక పోతున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు వేసి..ధ‌ర‌లు పెంచినందుకు 400 సీట్లు వ‌స్తాయా? అని ప్ర‌శ్నించారు. దేశంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టే పార్టీల‌కు ఓట‌ర్లు త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌ని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బ‌త‌ప్ప‌ద‌ని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామ‌ని 4 నుంచి 5 స్థానాల్లో విజ‌యం ఖాయ‌మ‌ని ఓవైసీ చెప్పారు.

This post was last modified on May 23, 2024 7:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దారి తప్పుతున్న కంటెంట్లు – ఎవరు బాధ్యులు

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…

14 minutes ago

మళ్ళీ అలా.. ఛాన్స్ వస్తే..

అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్‌లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్‌ని రివర్స్‌లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…

43 minutes ago

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

5 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

7 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

15 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

15 hours ago