ప్రధాని నరేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి తీసుకుంటామన్న వ్యవహారంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మద్దతిస్తామని.. తాము కూడా కోరుకుంటున్నది ఇదేనని తేల్చి చెప్పారు. పీవోకే.. భారత్లో అంతర్భాగమని తాము ఆది నుంచి చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా పీవోకే వెనక్కి తీసుకుంటామంటే.. తమ మద్దతు కూడా ఉంటుందన్నారు.
“పీవోకే భారత్ భూ భాగమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తీసుకుంటే మేం హర్షిస్తాం. మద్దతిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నికల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల ప్రక్రియను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు.
కేవలం ఎన్నికల కోసం.. ప్రజలను రెచ్చగొట్టేందుకు మోడీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఓవైసీ దుయ్యబట్టారు. బీజేపీకి 400 సీట్టు వస్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎలా 400 సీట్లు వస్తాయని ప్రశ్నిస్తే.. మాత్రం సమాధానం చెప్పలేక పోతున్నారని అన్నారు. ప్రజలపై పన్నులు వేసి..ధరలు పెంచినందుకు 400 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బతప్పదని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామని 4 నుంచి 5 స్థానాల్లో విజయం ఖాయమని ఓవైసీ చెప్పారు.
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…