ప్రధాని నరేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి తీసుకుంటామన్న వ్యవహారంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మద్దతిస్తామని.. తాము కూడా కోరుకుంటున్నది ఇదేనని తేల్చి చెప్పారు. పీవోకే.. భారత్లో అంతర్భాగమని తాము ఆది నుంచి చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా పీవోకే వెనక్కి తీసుకుంటామంటే.. తమ మద్దతు కూడా ఉంటుందన్నారు.
“పీవోకే భారత్ భూ భాగమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తీసుకుంటే మేం హర్షిస్తాం. మద్దతిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నికల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల ప్రక్రియను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు.
కేవలం ఎన్నికల కోసం.. ప్రజలను రెచ్చగొట్టేందుకు మోడీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఓవైసీ దుయ్యబట్టారు. బీజేపీకి 400 సీట్టు వస్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎలా 400 సీట్లు వస్తాయని ప్రశ్నిస్తే.. మాత్రం సమాధానం చెప్పలేక పోతున్నారని అన్నారు. ప్రజలపై పన్నులు వేసి..ధరలు పెంచినందుకు 400 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బతప్పదని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామని 4 నుంచి 5 స్థానాల్లో విజయం ఖాయమని ఓవైసీ చెప్పారు.
This post was last modified on May 23, 2024 7:48 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…