ప్రధాని నరేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి తీసుకుంటామన్న వ్యవహారంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మద్దతిస్తామని.. తాము కూడా కోరుకుంటున్నది ఇదేనని తేల్చి చెప్పారు. పీవోకే.. భారత్లో అంతర్భాగమని తాము ఆది నుంచి చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా పీవోకే వెనక్కి తీసుకుంటామంటే.. తమ మద్దతు కూడా ఉంటుందన్నారు.
“పీవోకే భారత్ భూ భాగమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తీసుకుంటే మేం హర్షిస్తాం. మద్దతిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నికల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల ప్రక్రియను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు.
కేవలం ఎన్నికల కోసం.. ప్రజలను రెచ్చగొట్టేందుకు మోడీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఓవైసీ దుయ్యబట్టారు. బీజేపీకి 400 సీట్టు వస్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎలా 400 సీట్లు వస్తాయని ప్రశ్నిస్తే.. మాత్రం సమాధానం చెప్పలేక పోతున్నారని అన్నారు. ప్రజలపై పన్నులు వేసి..ధరలు పెంచినందుకు 400 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బతప్పదని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామని 4 నుంచి 5 స్థానాల్లో విజయం ఖాయమని ఓవైసీ చెప్పారు.
This post was last modified on May 23, 2024 7:48 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…