Political News

షాకింగ్‌: మోడీకి.. ఓవైసీ మ‌ద్ద‌తు.. !

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్య‌వ‌హ‌రించే ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గ‌త కొన్నాళ్లుగా ప్ర‌క‌టిస్తున్న పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)ను తిరిగి తీసుకుంటామ‌న్న వ్య‌వ‌హారంపై అస‌దుద్దీన్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తాము కూడా మ‌ద్ద‌తిస్తామ‌ని.. తాము కూడా కోరుకుంటున్న‌ది ఇదేన‌ని తేల్చి చెప్పారు. పీవోకే.. భార‌త్‌లో అంత‌ర్భాగ‌మ‌ని తాము ఆది నుంచి చెబుతున్న‌ట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. త‌మ మాట‌ల‌ను అప్ప‌ట్లో ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా పీవోకే వెన‌క్కి తీసుకుంటామంటే.. త‌మ మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌న్నారు.

“పీవోకే భార‌త్ భూ భాగ‌మే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. వెన‌క్కి తీసుకుంటే మేం హ‌ర్షిస్తాం. మ‌ద్ద‌తిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కానీ, అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్నారు.

కేవ‌లం ఎన్నిక‌ల కోసం.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు మోడీ బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఓవైసీ దుయ్య‌బ‌ట్టారు. బీజేపీకి 400 సీట్టు వ‌స్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని.. ఎలా 400 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌శ్నిస్తే.. మాత్రం స‌మాధానం చెప్ప‌లేక పోతున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు వేసి..ధ‌ర‌లు పెంచినందుకు 400 సీట్లు వ‌స్తాయా? అని ప్ర‌శ్నించారు. దేశంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టే పార్టీల‌కు ఓట‌ర్లు త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌ని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బ‌త‌ప్ప‌ద‌ని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామ‌ని 4 నుంచి 5 స్థానాల్లో విజ‌యం ఖాయ‌మ‌ని ఓవైసీ చెప్పారు.

This post was last modified on May 23, 2024 7:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

2 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

2 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

3 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

3 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

4 hours ago

కన్నడ హీరోయిన్ ప్రశ్న… జవాబు చెప్పగలమా?

దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…

4 hours ago