తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంది మహాభారతం. పోనీ.. మనం భారత కాలంలో లేకపోయినా.. కనీసం.. కళ్లుముందు కనిపిస్తున్న నిజానికి ఒప్పుకొనే కలికాలాన్నికూడా దాటి అధఃపాతాళానికి పడిపోయామా? అని అనిపిస్తోంది.
ఎందుకంటే.. కళ్లముందు కనిపిస్తున్నది.. వైసీపీ ఎమ్మెల్యే, పైగా 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు.. నేరుగా పోయి..ఒక పోలింగ్ బూత్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. బరితెగించి.. ఈవీఎంను, వీవీ ప్యాట్ను నేలకేసి కొట్టారు. పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా.. అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం ఇది.
ఇంత బరితెగింపు ఎందుకు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయమో.. లేక..తన ఆధిపత్యాన్ని చూపించాలని అనుకున్నా రో.. తెలియదు కానీ.. మొత్తానికి పిన్నెల్లి బరితెగించారు. చేయకూడని పని.. ఎవరైనా చేస్తే.. ఒకసీనియర్గా ఖండించాల్సిన పనిని తనే స్వయంగా తన చేతులతో చేసి.. ప్రజాస్వామ్యానికి, ఎన్నికల క్రతువుకుకూడా.. కళంకం తెచ్చారు.
ఈ క్రతువును ఖండించాల్సిన వైసీపీ.. సదరునేతపై .. చట్టం కంటే ముందుగా.. న్యాయస్థానాల కంటే ముందుగా.. చర్యలుతీసుకోవాల్సిన పార్టీ.. నిస్సిగ్గుగా.. నిర్మొహమాటంగా వెనుకేసుకు వచ్చింది. పిన్నెల్లి చేసింది తప్పుకాదని.. వైసీపీ పెద్దలు తేల్చేశారు.
ప్రజలుఏమనుకుంటారో.. అనే బిడియం కూడా లేకుండా.. వైసీపీ పిన్నెల్లిని వెనుకేసుకు వచ్చింది. పైగా ఆయన చేసిన పనిని సమర్థిస్తూ.. అక్కడ రిగ్గింగ్ జరిగింది అని తేల్చి చెప్పడం మరింత దారుణం. నిజమే అనుకుందాం. రిగ్గింగ్ జరిగిందే అనుకుందాం. దీనిని వ్యతిరేకించేందుకు వ్యవస్థలు లేవా?
ఇదే విషయాన్ని ఆధారాలతో నిరూపించి.. న్యాయ పోరాటం ద్వారా.. మరోసారి ఎన్నికలు నిర్వహించేలా చేసి ఉంటే.. పిన్నెల్లి ఒక మెట్టు పైకి ఎక్కి ఉండేవారు. కానీ, తనే జోక్యం చేసుకుని.. తనే తీర్పరిలా.. ఓటర్ల ను అవమానించడం.. హెచ్చరించడం.. ఫక్తు రౌడీగా మారి.. ఈవీఎంలను పగలగొట్టడం వంటివాటిని పాలక పక్షం వెనుకేసుకురావడం.. ఎంత వరకు సమంజసం.. అనేది ప్రజాస్వామ్యవాదులునిలదీస్తున్న ప్రశ్న.
ఏదేమైనా.. మేమింతే! అని చెప్పుకొంటున్నారనేది వాస్తవం. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు.. తన డ్రైవర్ను చంపి.. డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా.. పార్టీ ఇలానే వ్యవహరించింది. పల్నాడు ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడు.. తన అక్కను వేధిస్తున్న వారిపై దాడి చేసినందుకు.. ఏకంగా అతనిని తగలబెట్టి మారణహోమం సృష్టించినప్పుడూ.. ఈ ఘటనను ఖండించలేక పోవడం.. పైగా నిందుతులకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం.. వైసీపీకి మాయని మచ్చలుగా మారాయి. ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం .. మరింత కళంకం తీసుకువస్తోంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…