తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంది మహాభారతం. పోనీ.. మనం భారత కాలంలో లేకపోయినా.. కనీసం.. కళ్లుముందు కనిపిస్తున్న నిజానికి ఒప్పుకొనే కలికాలాన్నికూడా దాటి అధఃపాతాళానికి పడిపోయామా? అని అనిపిస్తోంది.
ఎందుకంటే.. కళ్లముందు కనిపిస్తున్నది.. వైసీపీ ఎమ్మెల్యే, పైగా 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు.. నేరుగా పోయి..ఒక పోలింగ్ బూత్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. బరితెగించి.. ఈవీఎంను, వీవీ ప్యాట్ను నేలకేసి కొట్టారు. పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా.. అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం ఇది.
ఇంత బరితెగింపు ఎందుకు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయమో.. లేక..తన ఆధిపత్యాన్ని చూపించాలని అనుకున్నా రో.. తెలియదు కానీ.. మొత్తానికి పిన్నెల్లి బరితెగించారు. చేయకూడని పని.. ఎవరైనా చేస్తే.. ఒకసీనియర్గా ఖండించాల్సిన పనిని తనే స్వయంగా తన చేతులతో చేసి.. ప్రజాస్వామ్యానికి, ఎన్నికల క్రతువుకుకూడా.. కళంకం తెచ్చారు.
ఈ క్రతువును ఖండించాల్సిన వైసీపీ.. సదరునేతపై .. చట్టం కంటే ముందుగా.. న్యాయస్థానాల కంటే ముందుగా.. చర్యలుతీసుకోవాల్సిన పార్టీ.. నిస్సిగ్గుగా.. నిర్మొహమాటంగా వెనుకేసుకు వచ్చింది. పిన్నెల్లి చేసింది తప్పుకాదని.. వైసీపీ పెద్దలు తేల్చేశారు.
ప్రజలుఏమనుకుంటారో.. అనే బిడియం కూడా లేకుండా.. వైసీపీ పిన్నెల్లిని వెనుకేసుకు వచ్చింది. పైగా ఆయన చేసిన పనిని సమర్థిస్తూ.. అక్కడ రిగ్గింగ్ జరిగింది అని తేల్చి చెప్పడం మరింత దారుణం. నిజమే అనుకుందాం. రిగ్గింగ్ జరిగిందే అనుకుందాం. దీనిని వ్యతిరేకించేందుకు వ్యవస్థలు లేవా?
ఇదే విషయాన్ని ఆధారాలతో నిరూపించి.. న్యాయ పోరాటం ద్వారా.. మరోసారి ఎన్నికలు నిర్వహించేలా చేసి ఉంటే.. పిన్నెల్లి ఒక మెట్టు పైకి ఎక్కి ఉండేవారు. కానీ, తనే జోక్యం చేసుకుని.. తనే తీర్పరిలా.. ఓటర్ల ను అవమానించడం.. హెచ్చరించడం.. ఫక్తు రౌడీగా మారి.. ఈవీఎంలను పగలగొట్టడం వంటివాటిని పాలక పక్షం వెనుకేసుకురావడం.. ఎంత వరకు సమంజసం.. అనేది ప్రజాస్వామ్యవాదులునిలదీస్తున్న ప్రశ్న.
ఏదేమైనా.. మేమింతే! అని చెప్పుకొంటున్నారనేది వాస్తవం. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు.. తన డ్రైవర్ను చంపి.. డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా.. పార్టీ ఇలానే వ్యవహరించింది. పల్నాడు ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడు.. తన అక్కను వేధిస్తున్న వారిపై దాడి చేసినందుకు.. ఏకంగా అతనిని తగలబెట్టి మారణహోమం సృష్టించినప్పుడూ.. ఈ ఘటనను ఖండించలేక పోవడం.. పైగా నిందుతులకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం.. వైసీపీకి మాయని మచ్చలుగా మారాయి. ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం .. మరింత కళంకం తీసుకువస్తోంది.
This post was last modified on May 22, 2024 10:39 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…