పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి సృష్టించిన అరాచకంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది దిగజారుడు తనమని వ్యాఖ్యానించారు. వైసీపీ మూకలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతాయని తాము ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. స్థానిక పోలీసులు తమ హెచ్చరికలను లైట్ తీసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అయినా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ మేరకు విదేశాల నుంచి మాచర్లలోని పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పోలింగ్ రోజు.. పిన్నెల్లి దౌర్జన్యంగా పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించడం..ఈవీఎంను, వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన విషయం వీడియోల రూపంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరి.. ఎమ్మెల్యే పిన్నెల్లిని ధైర్యంగా ఎదిరించారు. అయితే.. నంబూరిని పిన్నెల్లి హెచ్చరించారు. ఇది కూడా వీడియోల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో నంబూరిపై తర్వాత పిన్నెల్లి అనుచరులు దాడులకు పాల్పడ్డారు.
దీంతో నంబూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించిన దరిమిలా.. ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు విదేశాల నుంచి నంబూరితో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని.. ఎలాంటి భయం అవసరం లేదని.. పేర్కొన్నారు. పార్టీ తరఫున ఏజెంట్ గా ఉంటూ.. పిన్నెల్లిని ఎదిరించిన తీరును ఆయన అభినందించారు. పార్టీకోసం.. కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని.. ఎలాంటి అధైర్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని.. అవసరమైతే.. హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవాలని.. పార్టీ సహకరిస్తుందని నంబూరికి చంద్రబాబు అభయం ఇచ్చారు.
This post was last modified on May 22, 2024 10:30 pm
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…