పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి సృష్టించిన అరాచకంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది దిగజారుడు తనమని వ్యాఖ్యానించారు. వైసీపీ మూకలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతాయని తాము ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. స్థానిక పోలీసులు తమ హెచ్చరికలను లైట్ తీసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అయినా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ మేరకు విదేశాల నుంచి మాచర్లలోని పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పోలింగ్ రోజు.. పిన్నెల్లి దౌర్జన్యంగా పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించడం..ఈవీఎంను, వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన విషయం వీడియోల రూపంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరి.. ఎమ్మెల్యే పిన్నెల్లిని ధైర్యంగా ఎదిరించారు. అయితే.. నంబూరిని పిన్నెల్లి హెచ్చరించారు. ఇది కూడా వీడియోల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో నంబూరిపై తర్వాత పిన్నెల్లి అనుచరులు దాడులకు పాల్పడ్డారు.
దీంతో నంబూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించిన దరిమిలా.. ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు విదేశాల నుంచి నంబూరితో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని.. ఎలాంటి భయం అవసరం లేదని.. పేర్కొన్నారు. పార్టీ తరఫున ఏజెంట్ గా ఉంటూ.. పిన్నెల్లిని ఎదిరించిన తీరును ఆయన అభినందించారు. పార్టీకోసం.. కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని.. ఎలాంటి అధైర్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని.. అవసరమైతే.. హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవాలని.. పార్టీ సహకరిస్తుందని నంబూరికి చంద్రబాబు అభయం ఇచ్చారు.
This post was last modified on May 22, 2024 10:30 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…