పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టు భారీ ఉచ్చు బిగుసు కుంది. ఆయనను అరెస్టు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమయం నిర్ధారించింది. అసలు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసినట్టు తెలిసింది. అయితే.. రామకృష్నారెడ్డి స్తానికంగా లేరని.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారని.. సీఈవో చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఎక్కడున్నా తక్షణం వెతకాలని.. సాయంత్రం 5 గంటల లోగా ఆయనను అరెస్టు చేసి.. అరెస్టు కాపీని తమకు పంపించేలా డీజీపీకి సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. అంతేకాదు.. పిన్నెల్లి.. దేశం విడిచి పారిపోకుండా.. ఉండేలా.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయా లని.. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేయాలని కూడా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం పాటించేలా డీజీపీకి సూచించాలని తెలిపింది.
ఇదిలావుంటే.. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడంతో మొత్తంగా 15 పోలీసులు బృందాలు.. ఒక్కొక్క దా నిలో ఐదుగురు చొప్పున ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. రెండుబృందాలు హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన మూడు.. కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో పిన్నెల్లి ఉన్నట్టుగా సమాచారం రావ డంతో అక్కడకు చేరుకున్నారు. ఈ సాయంత్రంలో గా ఎప్పుడైనా.. పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదేసమయంలో ఎన్నికల సంఘం అధికారులు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా.. చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది. దీంతో డీజీపీ కార్యాలయం.. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ముందస్తు బెయిల్ కోరితే.. తమ వాదనలు కూడా వినాలని.. అప్పటి వరకు బెయిల్ ఇవ్వరాదని కూడా.. పిటిషన్ లో పేర్కొన్నారు.
This post was last modified on May 22, 2024 2:47 pm
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…