పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టు భారీ ఉచ్చు బిగుసు కుంది. ఆయనను అరెస్టు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమయం నిర్ధారించింది. అసలు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసినట్టు తెలిసింది. అయితే.. రామకృష్నారెడ్డి స్తానికంగా లేరని.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారని.. సీఈవో చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఎక్కడున్నా తక్షణం వెతకాలని.. సాయంత్రం 5 గంటల లోగా ఆయనను అరెస్టు చేసి.. అరెస్టు కాపీని తమకు పంపించేలా డీజీపీకి సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. అంతేకాదు.. పిన్నెల్లి.. దేశం విడిచి పారిపోకుండా.. ఉండేలా.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయా లని.. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేయాలని కూడా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం పాటించేలా డీజీపీకి సూచించాలని తెలిపింది.
ఇదిలావుంటే.. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడంతో మొత్తంగా 15 పోలీసులు బృందాలు.. ఒక్కొక్క దా నిలో ఐదుగురు చొప్పున ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. రెండుబృందాలు హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన మూడు.. కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో పిన్నెల్లి ఉన్నట్టుగా సమాచారం రావ డంతో అక్కడకు చేరుకున్నారు. ఈ సాయంత్రంలో గా ఎప్పుడైనా.. పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదేసమయంలో ఎన్నికల సంఘం అధికారులు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా.. చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది. దీంతో డీజీపీ కార్యాలయం.. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ముందస్తు బెయిల్ కోరితే.. తమ వాదనలు కూడా వినాలని.. అప్పటి వరకు బెయిల్ ఇవ్వరాదని కూడా.. పిటిషన్ లో పేర్కొన్నారు.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…
భారతీయ సినిమాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో 94 ఏళ్ల వయసులో ఫీచర్ ఫిలిం తీసి అబ్బురపరిచారు సింగీతం శ్రీనివాసరావు.…
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో…