లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో తెలంగాణలలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు ? అనే చర్చ మొదలయింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఏఏ సామాజిక వర్గాలకు ఈ సారి విస్తరణలో చోటు లభిస్తుంది ? సీనియర్లను తీసుకుంటారా ? కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా ? అధిష్టానం నిర్ణయిస్తుందా ? సీఎం రేవంత్ కు ఛాయిస్ ఇస్తుందా ? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తానని ప్రకటించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఇతడు సన్నిహితుడు కావడం విశేషం. అయితే మహబూబ్ నగర్ లో బీజేపీ నుండి పోటీ చేసిన డీకే అరుణకే విజయావకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో శ్రీహరికి మంత్రి వర్గంలో బెర్త్ లభిస్తుందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక భువనగిరి లోక్ సభ స్థానానికి తన సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ నిలబెట్టాడు. ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటాం అన్న సంకేతాలు ఇచ్చాడు రేవంత్. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందా ? అన్నది అనుమానమే.
తెలంగాణలో ముదిరాజ్ లతో పాటు కురుమల ప్రాబల్యమూ అధికమే. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అవకాశం లభిస్తుందని, మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి ఎమ్మెల్పీ బల్మూర్ వెంకట్ లేదా ఆది శ్రీనివాస్ కు అవకాశం లభిస్తుందని అంటున్నారు. గిరిజన సామాజిక వర్గం నుండి నల్లగొండ, వరంగల్ జిల్లాలకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఛాన్స్ దక్కే ఉంది. నిజామాబాద్ నుండి మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఇప్పటికే మంత్రులలో రెడ్డిల సంఖ్య మించిపోవడంతో అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
This post was last modified on May 22, 2024 2:46 pm
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…