పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ తనదే అధికారం అని అనుకోవడానికి లేదు. ఎన్నికలు వచ్చేంతవరకే ఏదైనా. ఒక్కసారి ప్రజలు ఓటుతో కొడితే ఎక్కడికో వెళ్లిపడాల్సిందే.
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా ముందు నువ్వెంత, రా చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తొడ కొట్టారు. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారని తెలిసింది.
మూడోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భావించి మల్లారెడ్డి లేనిపోని సవాళ్లు విసిరారు. రేవంత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన గెలిచారు సరే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ జోరందుకుంది.
ఇక ఇప్పుడేమో భూ కబ్జా విషయంలో సీఎం రేవంత్ను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సుచిత్ర వద్ద ఉన్న భూ వివాదంలో మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. ఈ వివాదంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ భూమి తనదేనని మల్లారెడ్డి మరోసారి చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ అడిగానని, రేవంత్ను కలిసి అన్ని విషయాలు తేల్చుకుంటానని మల్లారెడ్డి ప్రకటించారు. నేడో రేపో రేవంత్ను మల్లారెడ్డి కలిసే అవకాశముంది.
This post was last modified on %s = human-readable time difference 2:43 pm
తెలంగాణలో జున్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిన వ్యవహారం రాజకీయంగా…
‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు.…
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నట్టుగా…
టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే విషయంలో ప్రతిసారీ ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి కూడా అందుకు…
సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. వీటిలో ఏది అతి పెద్ద డిజాస్టర్, కంటెంట్…
రాష్ట్రంలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ ఎన్నికల పోలింగ్ ప్రత్యక్షంగా…