పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ తనదే అధికారం అని అనుకోవడానికి లేదు. ఎన్నికలు వచ్చేంతవరకే ఏదైనా. ఒక్కసారి ప్రజలు ఓటుతో కొడితే ఎక్కడికో వెళ్లిపడాల్సిందే.
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా ముందు నువ్వెంత, రా చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తొడ కొట్టారు. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారని తెలిసింది.
మూడోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భావించి మల్లారెడ్డి లేనిపోని సవాళ్లు విసిరారు. రేవంత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన గెలిచారు సరే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ జోరందుకుంది.
ఇక ఇప్పుడేమో భూ కబ్జా విషయంలో సీఎం రేవంత్ను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సుచిత్ర వద్ద ఉన్న భూ వివాదంలో మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. ఈ వివాదంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ భూమి తనదేనని మల్లారెడ్డి మరోసారి చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ అడిగానని, రేవంత్ను కలిసి అన్ని విషయాలు తేల్చుకుంటానని మల్లారెడ్డి ప్రకటించారు. నేడో రేపో రేవంత్ను మల్లారెడ్డి కలిసే అవకాశముంది.
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…