ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్రది కీలక పాత్ర. ఈ ప్రాంతంలో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ఇవి కీలకమనే చెప్పాలి. అందుకే ఉత్తరాంధ్రలో అత్యధిక స్థానాలు గెలిచే పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఓటర్లు కూటమికే జైకొట్టారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుభి మోగించడం ఖాయమని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి కంచుకోటలాంటింది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ టీడీపీకి పట్టున్న స్థానాలున్నాయి. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలికి ఫలితాలు తారుమారయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. కానీ ఈ సారి మాత్రం ఆ సంఖ్య కచ్చితంగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు కూటమి వైపు మొగ్గుచూపారనే చెప్పాలి. విజయనగరంలో 2019లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. ఇక్కడ వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి షాక్ తప్పదనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ ప్రభంజనం మరోసారి పునరావృతమవుతుందని చెబుతున్నారు.
ఇక విశాఖపట్నం చూసుకుంటే అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. కానీ ఈ సారి మాత్రం లెక్క మారుస్తామంటూ కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ఈవీఎంలలో నమోదైన ఓట్లతో ఉత్తరాంధ్రలో టీడీపీ మరోసారి జయకేతనం ఎగురవేయబోతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ప్రకటించడం, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే వైసీపీ ఆశలు కూలేందుకు ఎంతో సమయం లేదనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…