Political News

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేశారో తెలియ‌క‌.. మేధావులు సైతం జ‌ట్టుపీక్కుంటున్న ప‌రిస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. ఓట‌రు నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసి కూడా.. చాలా స‌ర్వేలు ఏమీ తేల్చ‌లేక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఇక, పోటెత్తిన ఓట‌రు దెబ్బ‌కు ఈవీఎంల‌లో ఎన్న‌డూలేన‌న్ని రికార్డు స్థాయిలో ఓట్లు పోల‌య్యాయి. మొత్తంగా.. ఓట‌రు నాడి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. కానీ, వైసీపీలో కీల‌క నాయ‌కులు మాత్రం త‌మ‌దే గెలుప‌ని డ‌బ్బా కొట్టుకుంటున్నారు.

సీఎం జ‌గ‌న్ బ్రిట‌న్‌కు వెళ్తూ.. ముందు రోజు విజ‌య‌వాడ‌లో ఐప్యాక్‌తో మాట్లాడిన‌ప్పుడు త‌మ‌కు 151 సీట్లు త‌గ్గ‌వ‌ని చెప్పారు. త‌మదే విజ‌య‌మ‌ని చెప్పుకొన్నారు. మ‌రి దీనికి ఈక్వేష‌న్ ఏంటో ఆయ‌న చెప్ప‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. మంత్రి బొత్స స‌త్య‌నా రాయణ మ‌రో అడుగు ముందుకు వేశారు. ఏపీలో మ‌రోసారి త‌మ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని విశాఖ‌లో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితం వ‌స్తుండ‌గా.. 9వ తేదీన సీఎంగా రెండో సారిజ‌గ‌నే ప్ర‌మాణం చేస్తార‌ని చెప్పారు. అంతేకాదు.. విశాఖే వేదిక‌ని కూడా బొత్స చెప్పుకొచ్చారు. ఇదే విష‌యాన్ని త‌ర్వాత కూడా ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా ముహూర్తంతో పాటు.. స‌మయం కూడా చెప్పుకొచ్చారు. తమ పార్టీకి 151 సీట్లు త‌గ్గ‌వ‌ని ఈయ‌న కూడా నొక్కి వ‌క్కాణించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌మ‌దే విజ‌య‌మ‌ని చెప్పారు. జూన్ 4న ఫ‌లితం వ‌స్తుంద‌ని.. అదే నెల 9వ తేదీన సీఎంగా రెండో సారి జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని తెలిపారు. అంతేకాదు.. ఆ రోజు ఉద‌యం 9.38 గంట‌ల‌కు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల్లో అనుకూల ఓటు వ‌ల్లే.. పోలింగ్ శాతం పెరిగింద‌ని వైవీ జోస్యం చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరి జోస్యాలు చూస్తే.. ఔనా.. నిజ‌మా! అని నోరెళ్ల‌బెడుతున్నారు ప్ర‌జ‌లు. వాస్త‌వ ఫ‌లితం రావ‌డానికి ఇంకా 14 రోజుల స‌మ‌యం ఉంది. దీంతో ఇత‌ర పార్టీల నాయ‌కులు మౌనంగా ఉంటే.. వైసీపీ మాత్రం త‌మ‌దే గెలుప‌ని వ్యాఖ్యానించ‌డం.. ముహూర్తాలు.. తారీఖులు, స‌మ‌యాలు నిర్ణ‌యించ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. మ‌రి ఇవి ఏమేర‌కు నిజ‌మ‌వుతాయో చూడాలి.

This post was last modified on May 21, 2024 11:20 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago