మెతుకుమెల్లి శ్రీభరత్. గీతం విశ్వవిద్యాలయం సీఈవోగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఇక, నటసింహం బాలయ్య చిన్నల్లుడిగా కూడా.. ఆయన పేరు అందరికీ తెలిసిందే. విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ కోరినా.. పట్టుబట్టినా.. ససేమిరా అన్న చంద్రబాబు ఈ సీటును మాత్రం శ్రీభరత్కే కేటాయించారు. వాస్తవానికి ఇక్కడ వైసీసీ పెద్ద ప్రయోగం చేసింది. కాకలు తీరిన నాయకురాలు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బోత్స ఝాన్సీని వైసీపీ నిలబెట్టింది.
దీంతో శ్రీభరత్ విజయం అంత ఈజీ అయితే కాదనే వాదన తొలినాళ్లలో వినిపించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడి పోయారన్న సానుభూతి కనిపిస్తుందని అనుకున్నా.. బొత్స ఝాన్సీ వైసీపీ తరఫున ఇక్కడ ఎంట్రీ ఇచ్చాక.. పరిస్థితి మారిపోయిందని అనుకున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారం ముందు ఆమెకు సానుకూల పవనాలు పెరిగాయి. దీంతో శ్రీభరత్ ఎదురీత చేయాల్సి వస్తోందని విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈ సమయంలో కూటమి పార్టీల అండ ఎలా ఉందనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. మరోవైపు.. విశాఖలో గత ఐదేళ్లుగా ఉండి.. అనేక కార్యక్రమాలు చేసిన జీవీఎల్ నరసింహారావు టికెట్ ఆశించారు.
కానీ, ఆయనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన అలిగి ప్రచారానికి దూరంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ భరత్కు మైనస్గా మారాయని విశ్లేషకులు లెక్కలు వేశారు. ఇక, జనసేన తరఫున కూడా.. నాయకులు ఇక్కడ కలిసి రావడం లేదన్నారు. అయితే..ఇవన్నీ.. ఎన్నికల పోలింగ్కు వారం ముందు మారిపోవడం.. అందరూ కలిసి రావడం.. ముఖ్యంగా సిటీ పరిదిలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పుంజుకోవడం వంటివి.. కూడా భరత్కు కలిసి వచ్చిన పరిణామంగా మారిందని తాజాగా అంచనాలు వస్తున్నాయి.
ఓ ప్రముఖ సర్వే సంస్థ.. కూడా విశాఖలో కూటమికి అవకాశం మెండుగా ఉంటుందని అంచనా వేసింది. మామ నందమూరి బాలయ్య.. చివరి క్షణంలో చేసిన ప్రచారం.. ఇతర కుటుంబ సభ్యులు కూడా.. కలిసి రావడం వంటివి భరత్ విజయానికి అవకాశం కల్పించిందని లెక్కలు కడుతున్నారు. దీంతో శ్రీభరత్కు కూటమి తరఫున ఈ దఫా గెలుపు తథ్యమనే అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల నేపథ్యంలో శ్రీభరత్.. తన వర్గానికి తాజాగా విందు ఇచ్చారని తెలిసింది. ఈ విందులకు పార్టీలో తనకు సహకరించిన వారిని, నియోజకవర్గంలో పనిచేసిన వారిని ఆయన ఆహ్వానించడం.. వారికి కానుకలు కూడా ఇవ్వడం వంటివి చూస్తే.. బాలయ్య చిన్నల్లుడు గెలుపు ఖాయమనే అంచనాలు నిజమేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 21, 2024 7:02 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…