Political News

బాల‌య్య చిన్న‌ల్లుడి సంబ‌రాలు.. రీజ‌నేంటి?

మెతుకుమెల్లి శ్రీభ‌ర‌త్‌. గీతం విశ్వ‌విద్యాల‌యం సీఈవోగా ఆయ‌న అంద‌రికీ సుప‌రిచితుడే. ఇక‌, న‌ట‌సింహం బాల‌య్య చిన్న‌ల్లుడిగా కూడా.. ఆయ‌న పేరు అంద‌రికీ తెలిసిందే. విశాఖపట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి ఆయ‌న పోటీ చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ కోరినా.. ప‌ట్టుబ‌ట్టినా.. స‌సేమిరా అన్న చంద్ర‌బాబు ఈ సీటును మాత్రం శ్రీభ‌ర‌త్‌కే కేటాయించారు. వాస్త‌వానికి ఇక్క‌డ వైసీసీ పెద్ద ప్ర‌యోగం చేసింది. కాక‌లు తీరిన నాయ‌కురాలు.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌తీమ‌ణి, మాజీ ఎంపీ బోత్స ఝాన్సీని వైసీపీ నిల‌బెట్టింది.

దీంతో శ్రీభ‌ర‌త్ విజ‌యం అంత ఈజీ అయితే కాద‌నే వాద‌న తొలినాళ్ల‌లో వినిపించింది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడి పోయారన్న సానుభూతి క‌నిపిస్తుంద‌ని అనుకున్నా.. బొత్స ఝాన్సీ వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ ఎంట్రీ ఇచ్చాక‌.. ప‌రిస్థితి మారిపోయింద‌ని అనుకున్నారు. నిజానికి ఎన్నిక‌ల ప్ర‌చారం ముందు ఆమెకు సానుకూల ప‌వ‌నాలు పెరిగాయి. దీంతో శ్రీభ‌ర‌త్ ఎదురీత చేయాల్సి వ‌స్తోందని విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో కూట‌మి పార్టీల అండ ఎలా ఉంద‌నే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రోవైపు.. విశాఖ‌లో గ‌త ఐదేళ్లుగా ఉండి.. అనేక కార్య‌క్ర‌మాలు చేసిన జీవీఎల్ న‌ర‌సింహారావు టికెట్ ఆశించారు.

కానీ, ఆయ‌న‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో ఆయ‌న అలిగి ప్ర‌చారానికి దూరంగా ఉన్నారని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌న్నీ భ‌ర‌త్‌కు మైన‌స్‌గా మారాయ‌ని విశ్లేష‌కులు లెక్క‌లు వేశారు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున కూడా.. నాయ‌కులు ఇక్క‌డ క‌లిసి రావ‌డం లేదన్నారు. అయితే..ఇవ‌న్నీ.. ఎన్నిక‌ల పోలింగ్కు వారం ముందు మారిపోవ‌డం.. అంద‌రూ క‌లిసి రావ‌డం.. ముఖ్యంగా సిటీ ప‌రిదిలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, జ‌న‌సేన పుంజుకోవ‌డం వంటివి.. కూడా భ‌ర‌త్‌కు క‌లిసి వ‌చ్చిన ప‌రిణామంగా మారింద‌ని తాజాగా అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఓ ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌.. కూడా విశాఖ‌లో కూట‌మికి అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. మామ‌ నంద‌మూరి బాల‌య్య‌.. చివ‌రి క్ష‌ణంలో చేసిన ప్ర‌చారం.. ఇత‌ర కుటుంబ స‌భ్యులు కూడా.. క‌లిసి రావ‌డం వంటివి భ‌ర‌త్ విజ‌యానికి అవ‌కాశం క‌ల్పించింద‌ని లెక్క‌లు క‌డుతున్నారు. దీంతో శ్రీభ‌ర‌త్‌కు కూట‌మి త‌ర‌ఫున ఈ ద‌ఫా గెలుపు త‌థ్య‌మ‌నే అంచ‌నాలు పెరిగాయి. ఈ అంచ‌నాల నేప‌థ్యంలో శ్రీభ‌ర‌త్‌.. త‌న వ‌ర్గానికి తాజాగా విందు ఇచ్చార‌ని తెలిసింది. ఈ విందుల‌కు పార్టీలో త‌న‌కు స‌హ‌క‌రించిన వారిని, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసిన వారిని ఆయ‌న ఆహ్వానించ‌డం.. వారికి కానుక‌లు కూడా ఇవ్వ‌డం వంటివి చూస్తే.. బాల‌య్య చిన్న‌ల్లుడు గెలుపు ఖాయ‌మ‌నే అంచ‌నాలు నిజ‌మేన‌ని అంటున్నారు పరిశీల‌కులు.

This post was last modified on May 21, 2024 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

47 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

51 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

1 hour ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

2 hours ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

2 hours ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

3 hours ago