2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని సీఎం జగన్ బల్లగుద్ది మరీ చెప్పి లండన్ వెళ్లిపోయారు. కానీ, ఐ ప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని, ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని పోలింగ్ కు ముందే పీకే పదే పదే చెప్పారు.
ఇక, వైసీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్ విశాఖలో ఈ నెల 9న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ ఎక్స్ ఖాతాలో అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో టీడీపీ కూటమిదే విజయమని పీకే మరోసారి జోస్యం చెప్పారు. జర్నలిస్ట్ బర్ఖాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమని పీకే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ మాదిరే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ముందు రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని చెప్పే నేతలను చూశానని, ఓటమిని అంగీకరించేవారిని చూడలేదని చెప్పారు. చంద్రబాబు గెలుస్తారని చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతం ఉండదని అన్నారు. బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని, బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. బీజేపీకి 2019లో వచ్చినన్ని సీట్లు వస్తాయని, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
This post was last modified on May 20, 2024 3:23 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…