Political News

చంద్రబాబే కాబోయే సీఎం అంటోన్న పీకే

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని సీఎం జగన్ బల్లగుద్ది మరీ చెప్పి లండన్ వెళ్లిపోయారు. కానీ, ఐ ప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని, ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని పోలింగ్ కు ముందే పీకే పదే పదే చెప్పారు.

ఇక, వైసీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్ విశాఖలో ఈ నెల 9న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ ఎక్స్ ఖాతాలో అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో టీడీపీ కూటమిదే విజయమని పీకే మరోసారి జోస్యం చెప్పారు. జర్నలిస్ట్ బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమని పీకే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ మాదిరే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ముందు రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని చెప్పే నేతలను చూశానని, ఓటమిని అంగీకరించేవారిని చూడలేదని చెప్పారు. చంద్రబాబు గెలుస్తారని చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతం ఉండదని అన్నారు. బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని, బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. బీజేపీకి 2019లో వచ్చినన్ని సీట్లు వస్తాయని, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

This post was last modified on May 20, 2024 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

14 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago