టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలోనూ కొంత మేరకు అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా చింతమనేనికి బలమైన పట్టున్న నియోజకవర్గం పరిధిలోని పెదవేగి మండలంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో చింతమనేని అనుచరులపై కేసులు పెట్టివారిని స్టేషన్కు తరలించారు.
ఈ విషయం తెలిసిన చింతమనేని.. నేరుగా స్టేషన్ వెళ్లి.. ఉన్నతాధికారులు లేని సమయంలో తన అనుచరులను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింతమనేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేషన్పై దౌర్జన్యం చేశారన్న కోణంలో ఆయనను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని నియోజకవర్గం సహా జిల్లాను కూడా వదిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని.. ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అనుచరులను, చింతమనేనిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఈ నెల 13న పెదవేగి మండలంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. దీనివెనుక చింతమనేని అనుచరులు ఉన్నారనేది బాధితుడు చెబుతున్న వాదన. దీంతో ప్రధాన అనుచరుడు రాజశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మరో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువెళ్లారనేది చింతమనేనిపై ఉన్న ఆరోపణ. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింతమనేని వాగ్వాదానికి దిగారని అంటున్నారు. దీంతో ఆయనపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చింతమనేనని కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
This post was last modified on May 20, 2024 8:28 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…