టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలోనూ కొంత మేరకు అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా చింతమనేనికి బలమైన పట్టున్న నియోజకవర్గం పరిధిలోని పెదవేగి మండలంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో చింతమనేని అనుచరులపై కేసులు పెట్టివారిని స్టేషన్కు తరలించారు.
ఈ విషయం తెలిసిన చింతమనేని.. నేరుగా స్టేషన్ వెళ్లి.. ఉన్నతాధికారులు లేని సమయంలో తన అనుచరులను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింతమనేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేషన్పై దౌర్జన్యం చేశారన్న కోణంలో ఆయనను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని నియోజకవర్గం సహా జిల్లాను కూడా వదిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని.. ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అనుచరులను, చింతమనేనిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఈ నెల 13న పెదవేగి మండలంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. దీనివెనుక చింతమనేని అనుచరులు ఉన్నారనేది బాధితుడు చెబుతున్న వాదన. దీంతో ప్రధాన అనుచరుడు రాజశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మరో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువెళ్లారనేది చింతమనేనిపై ఉన్న ఆరోపణ. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింతమనేని వాగ్వాదానికి దిగారని అంటున్నారు. దీంతో ఆయనపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చింతమనేనని కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
This post was last modified on May 20, 2024 8:28 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…