టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలోనూ కొంత మేరకు అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా చింతమనేనికి బలమైన పట్టున్న నియోజకవర్గం పరిధిలోని పెదవేగి మండలంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో చింతమనేని అనుచరులపై కేసులు పెట్టివారిని స్టేషన్కు తరలించారు.
ఈ విషయం తెలిసిన చింతమనేని.. నేరుగా స్టేషన్ వెళ్లి.. ఉన్నతాధికారులు లేని సమయంలో తన అనుచరులను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింతమనేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేషన్పై దౌర్జన్యం చేశారన్న కోణంలో ఆయనను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని నియోజకవర్గం సహా జిల్లాను కూడా వదిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని.. ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అనుచరులను, చింతమనేనిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఈ నెల 13న పెదవేగి మండలంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. దీనివెనుక చింతమనేని అనుచరులు ఉన్నారనేది బాధితుడు చెబుతున్న వాదన. దీంతో ప్రధాన అనుచరుడు రాజశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మరో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువెళ్లారనేది చింతమనేనిపై ఉన్న ఆరోపణ. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింతమనేని వాగ్వాదానికి దిగారని అంటున్నారు. దీంతో ఆయనపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చింతమనేనని కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
This post was last modified on May 20, 2024 8:28 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…