Political News

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొంత మేర‌కు అల్ల‌ర్లు జ‌రిగాయి. ముఖ్యంగా చింత‌మ‌నేనికి బ‌ల‌మైన ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద‌వేగి మండ‌లంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని అనుచ‌రుల‌పై కేసులు పెట్టివారిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ విష‌యం తెలిసిన చింత‌మ‌నేని.. నేరుగా స్టేష‌న్ వెళ్లి.. ఉన్న‌తాధికారులు లేని స‌మ‌యంలో త‌న అనుచ‌రుల‌ను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింత‌మ‌నేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేష‌న్‌పై దౌర్జ‌న్యం చేశార‌న్న కోణంలో ఆయ‌న‌ను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గం స‌హా జిల్లాను కూడా వ‌దిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయార‌ని.. ఆయ‌న వ‌ర్గం నేత‌లు చెబుతున్నారు. అనుచ‌రుల‌ను, చింత‌మ‌నేనిని కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన ఈ నెల 13న పెద‌వేగి మండ‌లంలోని ఓ పోలింగ్ బూత్ స‌మీపంలో ఓ వ్య‌క్తిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. దీనివెనుక చింత‌మ‌నేని అనుచ‌రులు ఉన్నార‌నేది బాధితుడు చెబుతున్న వాద‌న‌. దీంతో ప్ర‌ధాన అనుచ‌రుడు రాజ‌శేఖ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మ‌రో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేష‌న్ నుంచి బ‌ల‌వంతంగా తీసుకువెళ్లార‌నేది చింత‌మ‌నేనిపై ఉన్న ఆరోప‌ణ‌. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింత‌మ‌నేని వాగ్వాదానికి దిగార‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న‌పై కూడా కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం చింత‌మ‌నేన‌ని కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్టు తెలిసింది.

This post was last modified on May 20, 2024 8:28 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

35 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

45 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

1 hour ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago