Political News

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొంత మేర‌కు అల్ల‌ర్లు జ‌రిగాయి. ముఖ్యంగా చింత‌మ‌నేనికి బ‌ల‌మైన ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద‌వేగి మండ‌లంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని అనుచ‌రుల‌పై కేసులు పెట్టివారిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ విష‌యం తెలిసిన చింత‌మ‌నేని.. నేరుగా స్టేష‌న్ వెళ్లి.. ఉన్న‌తాధికారులు లేని స‌మ‌యంలో త‌న అనుచ‌రుల‌ను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింత‌మ‌నేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేష‌న్‌పై దౌర్జ‌న్యం చేశార‌న్న కోణంలో ఆయ‌న‌ను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గం స‌హా జిల్లాను కూడా వ‌దిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయార‌ని.. ఆయ‌న వ‌ర్గం నేత‌లు చెబుతున్నారు. అనుచ‌రుల‌ను, చింత‌మ‌నేనిని కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన ఈ నెల 13న పెద‌వేగి మండ‌లంలోని ఓ పోలింగ్ బూత్ స‌మీపంలో ఓ వ్య‌క్తిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. దీనివెనుక చింత‌మ‌నేని అనుచ‌రులు ఉన్నార‌నేది బాధితుడు చెబుతున్న వాద‌న‌. దీంతో ప్ర‌ధాన అనుచ‌రుడు రాజ‌శేఖ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మ‌రో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేష‌న్ నుంచి బ‌ల‌వంతంగా తీసుకువెళ్లార‌నేది చింత‌మ‌నేనిపై ఉన్న ఆరోప‌ణ‌. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింత‌మ‌నేని వాగ్వాదానికి దిగార‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న‌పై కూడా కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం చింత‌మ‌నేన‌ని కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్టు తెలిసింది.

This post was last modified on May 20, 2024 8:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

29 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago