Political News

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. కీల‌క‌మైన ఎన్నిక‌ల పోలింగ్‌కు వారం ముందు ఆయ‌న‌ను 48 గంట‌ల పాటు ప్ర‌చారంలో పాల్గొన‌కుండా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అడ్డుకుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ స‌హా కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ నోరు చేసుకోవ‌డ‌మే. దీనిపై వివ‌ర‌ణ కోరిన ఎన్నిక‌ల సంఘం.. ఆ వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌లేదు. దీంతో 48 గంట‌ల పాటు ఆయ‌న‌ను ప్ర‌చారం నుంచి స‌స్పెండ్ చేసింది.

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌న్నెర్ర చేసింది. ఆయ‌న‌పైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను ఆదేశించింది. దీంతో కేటీఆర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది చూడాలి. ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. నిన్న తండ్రి నేడు కొడుకు.. అడ్డంగా బుక్క‌య్యారంటూ.. అధికార ప‌క్షం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

ఈ నెల 13న తెలంగాణ‌లో నాలుగో ద‌శ పోలింగ్ లో భాగంగా 17 పార్ల‌మెంటుస్థానాల‌కు ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. ఆరోజు.. త‌న ఓటు భ‌క్కు వినియోగించుకున్న మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌.. పోలింగ్ బూత్ వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాను ఏ పార్టీకి, ఏ అభ్య‌ర్థికి ఓటు వేసిందీ.. ప‌రోక్షంగా అర్ధ‌మ‌య్యేలా చెప్పేసి.. నోరు జారారు. నిజానికి ఓటు వేసిన త‌ర్వాత‌.. ఎవ‌రూ తాము ఎవ‌రికిఓటేసిందీ చెప్ప‌డానికి వీల్లేదు. ఇది కామ‌న్ రూల్‌. అయితే.. కేటీఆర్ తెలిసి కూడా ఈ విష‌యాన్ని విస్మ‌రించారు.

తాను ఏ నాయ‌కుడికి ఓటు వేసిందీ.. మీడియా ముందు ప‌రోక్షంగా చెప్పేశారు. దీనిపై అప్ప‌ట్లోనే తీవ్ర దుమారం రేగింది. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌.. ఈ ఫిర్యాదును కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. త‌ర్వాత‌.. కేటీఆర్ వివ‌ర‌ణ కోరుతూ.. నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15 లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేటీఆర్‌ను ఈసీ ఆదేశించింది. కానీ, ఆయ‌న లైట్ తీసుకున్నారు. మ‌రోసారి దీనిపై దృష్టి పెట్టిన ఈసీ.. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా భావించింది. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశిస్తూ వికాస్ రాజ్‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on May 20, 2024 8:25 am

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

52 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

1 hour ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

3 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

4 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

5 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

6 hours ago