Political News

వైసిపి ఎంపి పై అనర్హత వేటుకు టీడీపీ డిమాండ్

సభను తప్పుదోవ పట్టిస్తు, న్యాయవ్యవస్ధపై నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ టిడిపి డిమాండ్ చేసింది. రాజ్యసభలో జరిగిన చర్చపై విజయసాయి మాట్లాడుతూ అసందర్భంగా కోర్టుల్లో న్యాయమూర్తులపై బురదచల్లుతు, దుష్ప్రచారం చేయటం చాలా అభ్యంతరకరమంటూ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ మండిపోయారు. హైకోర్టు జడ్జీలపై పార్లమెంటులో చర్చించటం, బురదచల్లటం, ఆరోపణలు చేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదంటూ కనకమేడల స్పష్టంగా చెప్పారు.

తమ సొంత ప్రయోజనాలకోసం వైసిపి ఎంపి రాజ్యసభను వేదికగా వాడుకోవటంపై టిడిపి ఎంపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలను ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించకూడదన్న విషయాన్ని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఎంపి గుర్తుచేశారు. న్యాయస్ధానం ఆదేశాలపై తమకు ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని హైకోర్టులోనే చెప్పుకోవాలి కానీ రాజ్యసభలో ప్రస్తావించకూడదట.

నిజానికి కోర్టిచ్చిన స్టే విషయంలో వైసిపి ఎంపి ఎక్కడ ప్రస్తావించాలనే విషయాన్ని టిడిపి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వేదికపై తమ అభిప్రాయాలు లేదా ఆరోపణలు గుప్పించటమన్నది వైసిపి ఎంపి విచక్షణ అన్నది అందరికీ తెలిసిందే. అయితే… తదనంతర పరిణామాలు ఏమటనేది రాజ్యసభ చైర్మన్ కి సంబంధించిన విషయం. ఎంపి ప్రస్తావించిన అంశాలు అసంబద్ధంగా ఉందని రాజ్యసభ ఛైర్మన్ అనుకుంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తారు. ఇక్కడ జరిగింది కూడా ఇదే. కోర్టుల్లో తమ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోందని చెప్పటమే విజయసాయి ఉద్దేశ్యం. దాన్నే ఆయన రాజ్యసభ వేదికగా వ్యక్తం చేశారు.

రాజ్యసభ ఛైర్మన్ పదే పదే కూర్చోమని చెబుతున్న వైసిపి ఎంపి వినకుండా మాట్లాడటం ఏమిటంటూ టిడిపి ఎంపి అన్నారు. ఎంపిలు మాట్లాడుతున్నపుడు రాజ్యసభ ఛైర్మన్ అయినా లోక్ సభ స్పీకర్ అయినా కూర్చోమని చెబుతునే ఉంటారు. ఎంపిలు తాము చెప్పదలచుకున్నది చెబుతునే ఉంటారు. ఒక్క నిముషం ఇవ్వండి, రెండు నిముషాలివ్వండని ఎంపిలు అడుగుతూ తాము చెప్పదలచుకున్నది చెప్పేయటం సభల్లో చాలా సహజం. ఇది వైసిపి ఎంపితోనే మొదలుకాలేదు. ఏ పార్టీ ఎంపి మాట్లాడుతున్నా ఇలాగే వ్యవహరిస్తుంటారు.

This post was last modified on September 18, 2020 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago