Political News

కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా.. ప‌ల్నాడు, అనంత‌పురం, తిరుప‌తిజిల్లాల్లో హింస చెల‌రేగింది. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కు లు కూడా రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు గాయాల పాల‌య్యారు. మ‌రికొంద‌రు త‌న్నులు కూడా తిన్నారు. రాళ్ల వ‌ర్షాలు.. క‌ర్ర‌ల కుమ్ములాట‌లు కామ‌న్ అయిపోయాయి. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇప్పుడు కీల‌క‌మైన ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా జిల్లాల్లో జ‌రిగిన పోస్ట్‌పోల్ అరాచ‌కాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. అత్యంత వేగంగా ప‌రిశీల‌న చేసి.. బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీనిపై వెంట‌నే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించాల‌ని ఆదేశించింది. దీంతో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ద‌ర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 13 మంది సీనియ‌ర్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి.. ఆయాజిల్లాల్లో ప‌రిశీల‌న‌, ప‌రిశో ధ‌న చేస్తున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి జ‌రుగుతున్న ఈ ప‌రిశీల‌న‌ల్లో.. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని త‌మ‌దైన శైలిలో విచారిస్తున్నారు. అయితే..ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ దాడుల ను ప్రోత్స‌హించిన వైసీపీ, టీడీపీ కీల‌క నాయ‌కులు.. త‌ప్పించేసుకున్నారు. ఇత‌ర ప్రాంతాల‌కు ప‌రార య్యారు.

కానీ, అమాయ‌క కార్య‌క‌ర్త‌లు మాత్రం ప్ర‌స్తుతం పోలీసుల చేతుల్లో చావు దెబ్బ‌లు తింటున్నారు. పార్టీలు ఏవైనా.. కార్య‌క‌ర్త‌ల‌ను ఇరికించేసి.. నాయ‌కులు త‌ప్పించుకోవ‌డం ప‌ట్ల ఆయా కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌లోని వారు గ‌గ్గోలు పెడుతున్నారు. అనంత‌పురంలో వైసీపీ కార్యాల‌యం ముందు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప‌ల్నాడులోని ఎమ్మెల్యే కార్యాల‌యం ముందు కూడా కొంద‌రు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న నిర్వ‌హించారు.

This post was last modified on May 19, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

3 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago