Political News

కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా.. ప‌ల్నాడు, అనంత‌పురం, తిరుప‌తిజిల్లాల్లో హింస చెల‌రేగింది. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కు లు కూడా రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు గాయాల పాల‌య్యారు. మ‌రికొంద‌రు త‌న్నులు కూడా తిన్నారు. రాళ్ల వ‌ర్షాలు.. క‌ర్ర‌ల కుమ్ములాట‌లు కామ‌న్ అయిపోయాయి. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇప్పుడు కీల‌క‌మైన ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా జిల్లాల్లో జ‌రిగిన పోస్ట్‌పోల్ అరాచ‌కాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. అత్యంత వేగంగా ప‌రిశీల‌న చేసి.. బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీనిపై వెంట‌నే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించాల‌ని ఆదేశించింది. దీంతో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ద‌ర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 13 మంది సీనియ‌ర్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి.. ఆయాజిల్లాల్లో ప‌రిశీల‌న‌, ప‌రిశో ధ‌న చేస్తున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి జ‌రుగుతున్న ఈ ప‌రిశీల‌న‌ల్లో.. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని త‌మ‌దైన శైలిలో విచారిస్తున్నారు. అయితే..ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ దాడుల ను ప్రోత్స‌హించిన వైసీపీ, టీడీపీ కీల‌క నాయ‌కులు.. త‌ప్పించేసుకున్నారు. ఇత‌ర ప్రాంతాల‌కు ప‌రార య్యారు.

కానీ, అమాయ‌క కార్య‌క‌ర్త‌లు మాత్రం ప్ర‌స్తుతం పోలీసుల చేతుల్లో చావు దెబ్బ‌లు తింటున్నారు. పార్టీలు ఏవైనా.. కార్య‌క‌ర్త‌ల‌ను ఇరికించేసి.. నాయ‌కులు త‌ప్పించుకోవ‌డం ప‌ట్ల ఆయా కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌లోని వారు గ‌గ్గోలు పెడుతున్నారు. అనంత‌పురంలో వైసీపీ కార్యాల‌యం ముందు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప‌ల్నాడులోని ఎమ్మెల్యే కార్యాల‌యం ముందు కూడా కొంద‌రు కార్య‌క‌ర్త‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న నిర్వ‌హించారు.

This post was last modified on May 19, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

53 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago