దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ, లడ్డాఖ్ లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరగనుంది.
వీటిలో ప్రధానంగా గాంధీల కుటుంబాలకు కంచుకోటల వంటి అమేథీ , రాయబరేలీ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అమేథీ నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ జమ్ము, లడ్డాఖ్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.
జమ్ము లడ్డాఖ్ లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కాగా.. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగా లను మోహరించింది. ఏపీలో చోటు చేసుకున్న పోస్టు పోల్ అనంతర హింస నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.
అయితే.. ఈ పోలింగ్కు, ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్కు తేడా ఉంది. ఇప్పుడు జరగను న్న ఐదో దశ పోలింగ్… గాంధీల కుటుంబానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. రాయ్బరేలి నుంచి రాహుల్గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వరుస విజయాలుద క్కించుకున్న సోనియాగాంధీ ఈసారి తప్పుకోవడంతోఆయన పోటీలో ఉన్నారు. కానీ, రాహుల్ను ఇక్కడ ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎత్తుగడలను ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది.
ఇక, కీలకమైన అమేధీ నియోజకవర్గంలో రాహుల్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి ఈ స్థానంనుంచి అసలు ఆయన పోటీలోనే లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన శర్మను బరిలో దింపింది. అయినా.. ఇక్కడ గెలుస్తారనే ఆశలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమేరకు ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గాంధీల పరువు దక్కించుకుంటుందనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
This post was last modified on May 19, 2024 3:00 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…