Political News

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ, లడ్డాఖ్ లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరగనుంది.

వీటిలో ప్రధానంగా గాంధీల కుటుంబాలకు కంచుకోటల వంటి అమేథీ , రాయబరేలీ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అమేథీ నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ జమ్ము, లడ్డాఖ్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

జమ్ము లడ్డాఖ్ లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కాగా.. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగా లను మోహరించింది. ఏపీలో చోటు చేసుకున్న పోస్టు పోల్ అనంత‌ర హింస నేప‌థ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా కూడా చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ పోలింగ్‌కు, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు ద‌శ‌ల పోలింగ్‌కు తేడా ఉంది. ఇప్పుడు జ‌ర‌గ‌ను న్న ఐదో ద‌శ పోలింగ్‌… గాంధీల కుటుంబానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. రాయ్‌బ‌రేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలుద క్కించుకున్న సోనియాగాంధీ ఈసారి త‌ప్పుకోవ‌డంతోఆయ‌న పోటీలో ఉన్నారు. కానీ, రాహుల్‌ను ఇక్క‌డ ఓడించాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఎలా ఎదుర్కొంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

ఇక‌, కీల‌క‌మైన అమేధీ నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ సారి ఈ స్థానంనుంచి అస‌లు ఆయ‌న పోటీలోనే లేరు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన శ‌ర్మ‌ను బ‌రిలో దింపింది. అయినా.. ఇక్క‌డ గెలుస్తార‌నే ఆశ‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏమేర‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ గాంధీల ప‌రువు ద‌క్కించుకుంటుంద‌నేది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

This post was last modified on May 19, 2024 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

1 hour ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

3 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

3 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

5 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

7 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

7 hours ago