Political News

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ, లడ్డాఖ్ లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరగనుంది.

వీటిలో ప్రధానంగా గాంధీల కుటుంబాలకు కంచుకోటల వంటి అమేథీ , రాయబరేలీ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అమేథీ నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ జమ్ము, లడ్డాఖ్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

జమ్ము లడ్డాఖ్ లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కాగా.. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగా లను మోహరించింది. ఏపీలో చోటు చేసుకున్న పోస్టు పోల్ అనంత‌ర హింస నేప‌థ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా కూడా చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ పోలింగ్‌కు, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు ద‌శ‌ల పోలింగ్‌కు తేడా ఉంది. ఇప్పుడు జ‌ర‌గ‌ను న్న ఐదో ద‌శ పోలింగ్‌… గాంధీల కుటుంబానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. రాయ్‌బ‌రేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలుద క్కించుకున్న సోనియాగాంధీ ఈసారి త‌ప్పుకోవ‌డంతోఆయ‌న పోటీలో ఉన్నారు. కానీ, రాహుల్‌ను ఇక్క‌డ ఓడించాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఎలా ఎదుర్కొంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

ఇక‌, కీల‌క‌మైన అమేధీ నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ సారి ఈ స్థానంనుంచి అస‌లు ఆయ‌న పోటీలోనే లేరు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన శ‌ర్మ‌ను బ‌రిలో దింపింది. అయినా.. ఇక్క‌డ గెలుస్తార‌నే ఆశ‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏమేర‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ గాంధీల ప‌రువు ద‌క్కించుకుంటుంద‌నేది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

Satya

Recent Posts

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

8 minutes ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

33 minutes ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

1 hour ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

2 hours ago

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

4 hours ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

13 hours ago