ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, వైద్య పరీక్షల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా మే 18వ తేదీ రాత్రి హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్లారు.
అయితే, జగన్ మాదిరి కాకుండా చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. వైద్య పరీక్షలు ముగించుకొని ఐదారు రోజుల్లో చంద్రబాబు, భువనేశ్వరి హైదరాబాద్ చేరుకుంటారు.
మూడు నెలల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. వారణాసితోపాటు మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలను చంద్రబాబు, భువనేశ్వరి సందర్శించారు.
ఇక, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆల్రెడీ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి అమెరికా వెళ్లారు. లోకేష్ కూడా వారం రోజుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశముంది.
This post was last modified on May 19, 2024 12:51 pm
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…