రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. సీమ అంటేనే.. వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు బోలెడు ఉన్నాయి. గత 2019లోమూడు స్థానాల్లో తప్ప.. మిగిలినవన్నీకూడా.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 52 స్థానాలున్న సీమలో వైసీపీకి 49 చోట్ల విజయం దక్కింది. ఇది ఆ పార్టీ విజయానికి దోహద పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఈ సారి మరింత విజయం దక్కించుకోవాలన్నది పార్టీ లక్ష్యం.
అయితే.. ఇప్పుడు మారిన సమీకరణలు.. ప్రచారం చూస్తే.. వైసీపీ ఓట్లు హైజాక్ అయ్యాయని అంటున్నారు పరిశీలకులు. మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ గుంజేసుకుందని చెబుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల.. ఎక్కువగా సీమపైనే దృష్టి పెట్టారు. మొత్తం 38 రోజుల ప్రచారంలో 26 రోజుల పాటు ఆమె సీమలో పర్యటించారు. ప్రతి జిల్లాను టార్గెట్గా పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి పట్టున్న కడప, కర్నూలు ప్రాంతాల్లో వెళ్లిన చోటకే వెళ్లారు.
గట్టి ప్రచారం చేశారు షర్మిల. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు బదాబదలైందనేది కొందరు చెబుతున్న మాట. దీనిలో కాంగ్రెస్ కు మేలు చేసేంత కాకపోయినా.. వైసీపీకి నష్టం వాటిల్లే రీతిలో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు కడపలో జరిగిన పోలింగ్ను పరిశీలిస్తే.. గత ఎన్నికలకంటే కూడా.. ఎక్కువగా నమోదైంది. 83.77 శాతం పోలింగ్నమోదైంది. ఇది .. గత ఎన్నికలతో పొలిస్తే.. చాలా ఎక్కువ. గత 2019లో 73 శాతం పోలింగ్ జరిగితే.. ఈ సారి పది శాతం ఎక్కువగా ఉంది.
అంటే.. ఇది జగన్ కంటే కూడా షర్మిల, సునీతల ప్రభావంతోనే ఎక్కువగా జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావంతోనే వైసీపీకి పడాల్సిన ఓటు బ్యాంకు తగ్గుముఖం పట్టి ఉంటుందని లెక్కలు కడుతున్నారు. దీనిని వైసీపీ నాయకులు కూడా.. నర్మగర్భంగా అంగీకరిస్తున్నారు. కొంత సింపతీ ఉంటుంది.. అని కీలకనేత ఒకరు వ్యాఖ్యానించారు. చెంగు చాపి అడగడంతోపాటు.. కన్నీరు పెట్టుకున్న ఉదంతాలను కూడా ఆయన తెరమీదికి తెచ్చారు. ఇది వైసీపీ ఓటు బ్యాంకును హైజాక్ చేసి కాంగ్రెస్వైపు మళ్లించేలా చేసిందనడంలో కొంత వరకు నిజమేనని చెబుతున్నారు.
This post was last modified on May 17, 2024 8:11 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…