Political News

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. సీమ అంటేనే.. వైసీపీకి కంచుకోట‌గా ఉన్న నియోజ‌క‌వర్గాలు బోలెడు ఉన్నాయి. గ‌త 2019లోమూడు స్థానాల్లో త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీకూడా.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 52 స్థానాలున్న సీమ‌లో వైసీపీకి 49 చోట్ల విజ‌యం ద‌క్కింది. ఇది ఆ పార్టీ విజ‌యానికి దోహద ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఈ సారి మ‌రింత విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది పార్టీ ల‌క్ష్యం.

అయితే.. ఇప్పుడు మారిన స‌మీక‌ర‌ణ‌లు.. ప్ర‌చారం చూస్తే.. వైసీపీ ఓట్లు హైజాక్ అయ్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ గుంజేసుకుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. ఎక్కువ‌గా సీమ‌పైనే దృష్టి పెట్టారు. మొత్తం 38 రోజుల ప్ర‌చారంలో 26 రోజుల పాటు ఆమె సీమ‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌తి జిల్లాను టార్గెట్‌గా పెట్టుకుని ప్ర‌చారం చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి ప‌ట్టున్న క‌డ‌ప‌, క‌ర్నూలు ప్రాంతాల్లో వెళ్లిన చోట‌కే వెళ్లారు.

గ‌ట్టి ప్ర‌చారం చేశారు ష‌ర్మిల‌. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు బ‌దాబ‌ద‌లైంద‌నేది కొంద‌రు చెబుతున్న మాట‌. దీనిలో కాంగ్రెస్ కు మేలు చేసేంత కాక‌పోయినా.. వైసీపీకి న‌ష్టం వాటిల్లే రీతిలో జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌డ‌ప‌లో జ‌రిగిన పోలింగ్ను ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా.. ఎక్కువ‌గా న‌మోదైంది. 83.77 శాతం పోలింగ్‌న‌మోదైంది. ఇది .. గ‌త ఎన్నిక‌లతో పొలిస్తే.. చాలా ఎక్కువ‌. గ‌త 2019లో 73 శాతం పోలింగ్ జ‌రిగితే.. ఈ సారి ప‌ది శాతం ఎక్కువ‌గా ఉంది.

అంటే.. ఇది జ‌గ‌న్ కంటే కూడా ష‌ర్మిల‌, సునీత‌ల ప్ర‌భావంతోనే ఎక్కువ‌గా జ‌రిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ ప్ర‌భావంతోనే వైసీపీకి ప‌డాల్సిన ఓటు బ్యాంకు త‌గ్గుముఖం ప‌ట్టి ఉంటుంద‌ని లెక్క‌లు క‌డుతున్నారు. దీనిని వైసీపీ నాయ‌కులు కూడా.. న‌ర్మ‌గ‌ర్భంగా అంగీక‌రిస్తున్నారు. కొంత సింప‌తీ ఉంటుంది.. అని కీల‌క‌నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. చెంగు చాపి అడ‌గ‌డంతోపాటు.. క‌న్నీరు పెట్టుకున్న ఉదంతాల‌ను కూడా ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. ఇది వైసీపీ ఓటు బ్యాంకును హైజాక్ చేసి కాంగ్రెస్‌వైపు మ‌ళ్లించేలా చేసింద‌న‌డంలో కొంత వ‌ర‌కు నిజ‌మేన‌ని చెబుతున్నారు.

This post was last modified on May 17, 2024 8:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

6 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago