Political News

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఈ దాడుల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక పోయారని.. రాష్ట్ర ప్ర‌భు త్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాల‌ను నిల‌దీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. వారు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో ఏ మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో తానే స్వ‌యంగా ఈ హింస‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది.

ఎన్నిక‌ల అనంత‌రం చెలరేగిన హింస‌ను ముందుగానే ప‌సిగ‌ట్ట‌లేక పోయిన‌.. చ‌ర్య‌లు తీసుకోలేక పోయిన ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే ఆఫీస్ వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆయ‌న‌ను ఆదేశించింది. ఇక‌, ప‌ల్నాడు, అనంత‌పురం జిల్లాల ఎస్పీల‌ను స‌స్పెండ్ చేసింది. వారిని త‌క్ష‌ణ‌మే విధుల నుంచి త‌ప్పుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇక‌, ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం డీఎస్సీల‌ను కూడా స‌స్పెండ్ చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌, హింస‌ను ప్ర‌త్యేకంగా తీసుకుని ద‌ర్యాప్తు చేయాల‌ని పేర్కొంది. దీని వెనుక ప్రేరేపించిన వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌పైనా ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. ఐపీసీ స‌హా ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని.. అరెస్టులు, జైళ్లు వంటివి త‌క్ష‌ణం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. రాష్ట్రంలో మ‌రో 15 రోజుల పాటు కేంద్ర పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను కొన‌సాగించాల‌ని కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ముఖ్యంగా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహ‌రించాల‌ని.. త‌క్ష‌ణ‌మే గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌లు అదుపులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. వీటిని నియంత్రించడంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీలు ఇద్ద‌రూ కూడా బాధ్యులేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 17, 2024 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

30 ఏళ్ళ సినిమాని కాపీ కొట్టడం గ్రేట్

తాజాగా రిలీజైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తోందో చూస్తున్నాం. సాధారణంగా విజయ్ సినిమాలకు…

23 mins ago

సీఈవో బాబు: తాను చేస్తూ.. త‌న వారితో చేయిస్తూ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి సీఈవో అవ‌తారం ఎత్తారు. తానుప‌నిచేస్తూ.. త‌న వారితో ప‌నిచేయిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నారు. సాధార‌ణంగా య‌జ‌మాని…

27 mins ago

లండ‌న్ ప్ర‌యాణానికి జ‌గ‌న్ ఓకే.. కానీ, బ్రేక్ ప‌డింది!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక‌వైపు… రాష్ట్రంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించి..…

1 hour ago

సరిపోదా శనివారం….ఇంకో అవకాశం

వంద కోట్ల వైపు వేగంగా పరుగులు పెడుతున్న సరిపోదా శనివారంకు రెండో వీకెండ్ రూపంలో ఇంకో పెద్ద అవకాశం దొరికింది,.…

2 hours ago

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు.. వెతుకుతున్న పోలీసులు

అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్…

2 hours ago

తెలుగు చిత్రసీమకు సరిలేరు వేరెవ్వరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో…

3 hours ago