Political News

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఈ దాడుల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక పోయారని.. రాష్ట్ర ప్ర‌భు త్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాల‌ను నిల‌దీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. వారు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో ఏ మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో తానే స్వ‌యంగా ఈ హింస‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది.

ఎన్నిక‌ల అనంత‌రం చెలరేగిన హింస‌ను ముందుగానే ప‌సిగ‌ట్ట‌లేక పోయిన‌.. చ‌ర్య‌లు తీసుకోలేక పోయిన ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే ఆఫీస్ వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆయ‌న‌ను ఆదేశించింది. ఇక‌, ప‌ల్నాడు, అనంత‌పురం జిల్లాల ఎస్పీల‌ను స‌స్పెండ్ చేసింది. వారిని త‌క్ష‌ణ‌మే విధుల నుంచి త‌ప్పుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇక‌, ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం డీఎస్సీల‌ను కూడా స‌స్పెండ్ చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌, హింస‌ను ప్ర‌త్యేకంగా తీసుకుని ద‌ర్యాప్తు చేయాల‌ని పేర్కొంది. దీని వెనుక ప్రేరేపించిన వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌పైనా ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. ఐపీసీ స‌హా ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని.. అరెస్టులు, జైళ్లు వంటివి త‌క్ష‌ణం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. రాష్ట్రంలో మ‌రో 15 రోజుల పాటు కేంద్ర పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను కొన‌సాగించాల‌ని కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ముఖ్యంగా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహ‌రించాల‌ని.. త‌క్ష‌ణ‌మే గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌లు అదుపులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. వీటిని నియంత్రించడంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీలు ఇద్ద‌రూ కూడా బాధ్యులేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 17, 2024 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago