రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఈ దాడులను ఎందుకు నిలువరించలేక పోయారని.. రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తాలను నిలదీసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వారు ఇచ్చిన వివరణతో ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో తానే స్వయంగా ఈ హింసపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సంచలన నిర్ణయాలు ప్రకటించింది.
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసను ముందుగానే పసిగట్టలేక పోయిన.. చర్యలు తీసుకోలేక పోయిన పల్నాడు జిల్లా కలెక్టర్ను బదిలీ చేస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆఫీస్ వదిలి వెళ్లిపోవాలని ఆయనను ఆదేశించింది. ఇక, పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. వారిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, పల్నాడు, తిరుపతి, అనంతపురం డీఎస్సీలను కూడా సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఘర్షణ, హింసను ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని పేర్కొంది. దీని వెనుక ప్రేరేపించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టవద్దని తేల్చి చెప్పింది. ప్రతి ఘర్షణపైనా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. ఐపీసీ సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని.. అరెస్టులు, జైళ్లు వంటివి తక్షణం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. రాష్ట్రంలో మరో 15 రోజుల పాటు కేంద్ర పారా మిలిటరీ బలగాలను కొనసాగించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ముఖ్యంగా ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించాలని.. తక్షణమే గొడవలు, ఘర్షణలు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ఇద్దరూ కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
This post was last modified on May 17, 2024 7:02 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…