Political News

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్క‌డా బ‌య‌ట‌కు కూడా పొక్క‌కుండా మొత్తం క్ర‌తువును పూర్తి చేశారు. చివ‌రి రోజు పూర్ణాహుతి సంద‌ర్భంగా మాత్ర‌మే మీడియాకు ఫొటోలు విడుద‌ల చేశారు. బుధ‌వారం చివ‌రి రోజు నిర్వ‌హించిన పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఒక్క‌రే ఈ యాగంలో పాల్గొని క్ర‌తువులు పూర్తి చేశారు.

బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు ఈ యాగాన్ని పూర్తి చేశారు. పూర్తిగా కార్య‌క్ర‌మం అంతా కూడా.. సీఎం జ‌గ‌న్ నివాసంలోని ప్ర‌త్యేకంగా నిర్మించిన ఆల‌యంలో నిర్వ‌హించారు. 41 రోజులు నిర్వ‌హించిన రాజ‌శ్యామ‌ల యాగంలో 45 మంది పండితులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేష్ బాబు ప‌రిశీలించిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలో మ‌రోసారి అధికారం ద‌క్కించుకునే ఉద్దేశం, కోరిక‌తోనే ఈ రాజ‌శ్యామ‌ల యాగాన్ని నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ‌లోని శార‌దా పీఠంలో ఈ యాగాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అప్పుడు మొత్తం శార‌దా పీఠం నిర్వాహ‌కులే యాగాన్ని నిర్వ‌హించారు. ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ ఇంట్లో నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ఎక్క‌డా అజ‌లేక‌పోవ‌డం.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న వాయిస్ వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో దీనిని ఆయ‌న నిర్వ‌హించారు. అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ యాగాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు ఎన్నిక‌ల ప్ర‌చారం.. మ‌రోవైపు.. యాగ‌నిర్వ‌హ‌ణ‌తో ఆయ‌న ఊపిరి స‌ల‌ప‌నంత బిజీ అయ్యారు. ఇక‌, ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా 41 రోజులు, 21, 16, 3 రోజులు కూడా చేయ‌వ‌చ్చు.

This post was last modified on May 16, 2024 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

1 hour ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago