ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్కడా బయటకు కూడా పొక్కకుండా మొత్తం క్రతువును పూర్తి చేశారు. చివరి రోజు పూర్ణాహుతి సందర్భంగా మాత్రమే మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. బుధవారం చివరి రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ ఒక్కరే ఈ యాగంలో పాల్గొని క్రతువులు పూర్తి చేశారు.
బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు ఈ యాగాన్ని పూర్తి చేశారు. పూర్తిగా కార్యక్రమం అంతా కూడా.. సీఎం జగన్ నివాసంలోని ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించారు. 41 రోజులు నిర్వహించిన రాజశ్యామల యాగంలో 45 మంది పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేష్ బాబు పరిశీలించినట్టు సమాచారం.
రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకునే ఉద్దేశం, కోరికతోనే ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు విశాఖలోని శారదా పీఠంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు మొత్తం శారదా పీఠం నిర్వాహకులే యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు మాత్రం జగన్ ఇంట్లో నిర్వహించడం గమనార్హం. మరోవైపు.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఎక్కడా అజలేకపోవడం.. కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన వాయిస్ వినిపించకపోవడం గమనార్హం.
గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో దీనిని ఆయన నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు.. యాగనిర్వహణతో ఆయన ఊపిరి సలపనంత బిజీ అయ్యారు. ఇక, ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా 41 రోజులు, 21, 16, 3 రోజులు కూడా చేయవచ్చు.
This post was last modified on May 16, 2024 10:11 am
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…