ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్కడా బయటకు కూడా పొక్కకుండా మొత్తం క్రతువును పూర్తి చేశారు. చివరి రోజు పూర్ణాహుతి సందర్భంగా మాత్రమే మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. బుధవారం చివరి రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ ఒక్కరే ఈ యాగంలో పాల్గొని క్రతువులు పూర్తి చేశారు.
బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు ఈ యాగాన్ని పూర్తి చేశారు. పూర్తిగా కార్యక్రమం అంతా కూడా.. సీఎం జగన్ నివాసంలోని ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించారు. 41 రోజులు నిర్వహించిన రాజశ్యామల యాగంలో 45 మంది పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేష్ బాబు పరిశీలించినట్టు సమాచారం.
రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకునే ఉద్దేశం, కోరికతోనే ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు విశాఖలోని శారదా పీఠంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు మొత్తం శారదా పీఠం నిర్వాహకులే యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు మాత్రం జగన్ ఇంట్లో నిర్వహించడం గమనార్హం. మరోవైపు.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఎక్కడా అజలేకపోవడం.. కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన వాయిస్ వినిపించకపోవడం గమనార్హం.
గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో దీనిని ఆయన నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు.. యాగనిర్వహణతో ఆయన ఊపిరి సలపనంత బిజీ అయ్యారు. ఇక, ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా 41 రోజులు, 21, 16, 3 రోజులు కూడా చేయవచ్చు.
This post was last modified on May 16, 2024 10:11 am
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…