Political News

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది. ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా ? వైసీపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరు గెలుస్తారు ? ఎంత మెజారిటీ వస్తుంది ? అన్న ప్రాతిపదికన బెట్టింగ్ రాయుళ్లు బరిలోకి దిగారు. రూ.కోట్లలో పందాలు మొదలయ్యాయి. రూ.లక్షకు రూ.5 లక్షలు చొప్పున బెట్టింగ్ జరుగుతుండడం విశేషం.

ప్రధానంగా ఆంధ్రాలో అందరిచూపు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం మీదనే ఉంది. 2019 ఎన్నికలలో గాజువాక, భీమవరంలలో రెండు చోట్లా ఓటమిపాలైన నేపథ్యంలో ఈసారి పిఠాపురం మీద అందరిదృష్టి మళ్లింది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ? ఎంత మెజారిటీతో గెలుస్తాడు అన్న దాని మీద బెట్టింగ్ జరుగుతుంది. గత ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఈసారైనా గెలుస్తాడా ? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తాడు ? అన్న చర్చ జరుగుతుంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం మీద కూడా బెట్టింగులు జరుగతున్నాయి. ఆఖరు నిమిషంలో టీడీపీ టికెట్ సాధించి పోటీకి దిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గం మీద కూడా బెట్టింగ్ రాయుళ్లు గురిపెట్టారు. ఇక్కడ టీడీపీ రెబెల్ గా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థిగా నరసింహారాజు బరిలో ఉండడంతో ఈ ఫలితం మీద అందరికీ ఆసక్తి పెరిగింది.

భీమవరంలో జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్‌ల మధ్య పోటీపై పందాలు నడుస్తున్నాయి. విజయవాడ, నర్సాపుర్ ఎంపీ స్థానాలలో పాటు కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలక్రిష్ణల మీద వైసీపీ మహిళలను పోటీకి నిలపడంతో అక్కడి ఫలితాలు ఎలా ఉంటాయి ? అసలు జగన్ స్ట్రాటజీ పనిచేస్తుందా ? అని అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Satya

Recent Posts

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

9 minutes ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

1 hour ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

2 hours ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

3 hours ago

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

4 hours ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

5 hours ago