Political News

బీజేపీకి మ్యాజిక్‌ ఫికర్‌ !

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడు దశల పోలింగ్ లో నాలుగు దశలు పూర్తయ్యాయి. జూన్ 1తో ఏడో దశ పోలింగ్ ముగియనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే 400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈ సారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న వార్తలు కమలనాథులను కలవరపెడుతున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో 2019తో పోలిస్తే, తక్కువ ఓటింగ్‌ రికార్డవ్వడం అధికార బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నది. ఏప్రిల్‌ 19న జరిగిన తొలి దఫా పోలింగ్‌లో గతంతో పోలిస్తే 4 శాతం ఓటింగ్‌ తక్కువగా రికార్డయ్యింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3 శాతం ఓటింగ్‌ తక్కువగా నమోదైంది. మూడో దశలో 1.2 శాతం, నాలుగోదశంలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదయింది. ఈ పరిణామాలు మోడీ గ్రాఫ్ పడిపోయింది అన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో దేశమంతా గొప్పగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ అక్కడ పోటీచేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కశ్మీర్‌లో మూడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఆ మూడింటిలోనూ బీజేపీ పోటీలో లేదు. కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలను నెరవేర్చకపోవడం, కశ్మీరీ పండిట్ల హత్యాకాండ వెరసి బీజేపీ గ్రాఫ్‌ అక్కడ దారుణంగా పడిపోయింది. అక్కడ ఓటమి తప్పదన్న ఉద్దేశంతోనే అక్కడ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకొన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కనీస స్థానాలు 272 కావాలి. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ ఎన్డీయేకు రాబోదని, ఆ కూటమికి 268 సీట్లు కూడా దాటబోవని ప్రముఖ సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్‌ అంటుండగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటబోవని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చెబుతున్నారు.

This post was last modified on May 15, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

45 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago