దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడు దశల పోలింగ్ లో నాలుగు దశలు పూర్తయ్యాయి. జూన్ 1తో ఏడో దశ పోలింగ్ ముగియనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే 400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈ సారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న వార్తలు కమలనాథులను కలవరపెడుతున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో 2019తో పోలిస్తే, తక్కువ ఓటింగ్ రికార్డవ్వడం అధికార బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దఫా పోలింగ్లో గతంతో పోలిస్తే 4 శాతం ఓటింగ్ తక్కువగా రికార్డయ్యింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది. మూడో దశలో 1.2 శాతం, నాలుగోదశంలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదయింది. ఈ పరిణామాలు మోడీ గ్రాఫ్ పడిపోయింది అన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో దేశమంతా గొప్పగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ అక్కడ పోటీచేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కశ్మీర్ లోక్సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కశ్మీర్లో మూడు లోక్సభ స్థానాలు ఉండగా, ఆ మూడింటిలోనూ బీజేపీ పోటీలో లేదు. కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలను నెరవేర్చకపోవడం, కశ్మీరీ పండిట్ల హత్యాకాండ వెరసి బీజేపీ గ్రాఫ్ అక్కడ దారుణంగా పడిపోయింది. అక్కడ ఓటమి తప్పదన్న ఉద్దేశంతోనే అక్కడ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకొన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కనీస స్థానాలు 272 కావాలి. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయేకు రాబోదని, ఆ కూటమికి 268 సీట్లు కూడా దాటబోవని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అంటుండగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు.
This post was last modified on May 15, 2024 12:05 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…