ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే 2024 ఎన్నికల్లో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది.
82 శాతం పోలింగ్ జరగడంతో కూటమి పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసేందుకు జనం పోటెత్తారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి అధికారం కట్టబెట్టేందుకు మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తుది ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు వేచి చూస్తేనే ఈ ఉత్కంఠకు తెర పడుతుంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం(ఫైనల్ గణాంకాలు మారొచ్చు)
వైఎస్సార్ జిల్లా -79.40 శాతం
పశ్చిమగోదావరి – 82.70 శాతం
విజయనగరం -81.34 శాతం
విశాఖ -71.11 శాతం
కర్నూలు -75.83 శాతం
కృష్ణ -84.05 శాతం
కాకినాడ -80.05 శాతం
గుంటూరు – 78.81 శాతం
తిరుపతి -77.82 శాతం
శ్రీకాకుళం -76.07 శాతం
సత్యసాయి -82.77 శాతం
నెల్లూరు -82.10 శాతం
ప్రకాశం -87.09 శాతం
పార్వతీపురం -77.10 శాతం
పట్నాడు -85.65 శాతం
ఎన్టీఆర్ -79.68 శాతం
నంద్యాల -80.92 శాతం
ఏలూరు -83.55 శాతం
తూర్పుగోదావరి -80.94 శాతం
కోనసీమ-83.91 శాతం
చిత్తూరు -87.09 శాతం
బాపట్ల-84.98 శాతం
అన్నమయ్య -76.23 శాతం
అనంతపురం -79.25 శాతం
అనకాపల్లి -83.84 శాతం
అల్లూరి -70.20 శాతం
This post was last modified on May 15, 2024 10:07 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…