ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే 2024 ఎన్నికల్లో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది.
82 శాతం పోలింగ్ జరగడంతో కూటమి పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసేందుకు జనం పోటెత్తారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి అధికారం కట్టబెట్టేందుకు మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తుది ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు వేచి చూస్తేనే ఈ ఉత్కంఠకు తెర పడుతుంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం(ఫైనల్ గణాంకాలు మారొచ్చు)
వైఎస్సార్ జిల్లా -79.40 శాతం
పశ్చిమగోదావరి – 82.70 శాతం
విజయనగరం -81.34 శాతం
విశాఖ -71.11 శాతం
కర్నూలు -75.83 శాతం
కృష్ణ -84.05 శాతం
కాకినాడ -80.05 శాతం
గుంటూరు – 78.81 శాతం
తిరుపతి -77.82 శాతం
శ్రీకాకుళం -76.07 శాతం
సత్యసాయి -82.77 శాతం
నెల్లూరు -82.10 శాతం
ప్రకాశం -87.09 శాతం
పార్వతీపురం -77.10 శాతం
పట్నాడు -85.65 శాతం
ఎన్టీఆర్ -79.68 శాతం
నంద్యాల -80.92 శాతం
ఏలూరు -83.55 శాతం
తూర్పుగోదావరి -80.94 శాతం
కోనసీమ-83.91 శాతం
చిత్తూరు -87.09 శాతం
బాపట్ల-84.98 శాతం
అన్నమయ్య -76.23 శాతం
అనంతపురం -79.25 శాతం
అనకాపల్లి -83.84 శాతం
అల్లూరి -70.20 శాతం
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…