Political News

అఫీషియల్..ఏపీలో 80.66 శాతం పోలింగ్

ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే 2024 ఎన్నికల్లో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది.

82 శాతం పోలింగ్ జరగడంతో కూటమి పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసేందుకు జనం పోటెత్తారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి అధికారం కట్టబెట్టేందుకు మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తుది ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు వేచి చూస్తేనే ఈ ఉత్కంఠకు తెర పడుతుంది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం(ఫైనల్ గణాంకాలు మారొచ్చు)

వైఎస్సార్‌ జిల్లా -79.40 శాతం
పశ్చిమగోదావరి – 82.70 శాతం
విజయనగరం -81.34 శాతం
విశాఖ -71.11 శాతం
కర్నూలు -75.83 శాతం
కృష్ణ -84.05 శాతం
కాకినాడ -80.05 శాతం
గుంటూరు – 78.81 శాతం
తిరుపతి -77.82 శాతం
శ్రీకాకుళం -76.07 శాతం
సత్యసాయి -82.77 శాతం
నెల్లూరు -82.10 శాతం
ప్రకాశం -87.09 శాతం
పార్వతీపురం -77.10 శాతం
పట్నాడు -85.65 శాతం
ఎన్టీఆర్‌ -79.68 శాతం
నంద్యాల -80.92 శాతం
ఏలూరు -83.55 శాతం
తూర్పుగోదావరి -80.94 శాతం
కోనసీమ-83.91 శాతం
చిత్తూరు -87.09 శాతం
బాపట్ల-84.98 శాతం
అన్నమయ్య -76.23 శాతం
అనంతపురం -79.25 శాతం
అనకాపల్లి -83.84 శాతం
అల్లూరి -70.20 శాతం

This post was last modified on May 15, 2024 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago